
‘కార్మికులను బానిసలుగా మార్చే కుట్ర’
సిరిసిల్లటౌన్: కార్మికులను బానిసలుగా మార్చేలా బీజేపీ ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు టి.స్కై లాబ్బాబు విమర్శించారు. మే డే సంబంధించిన కరపత్రాలను సోమవారం సిరిసిల్లలోని పార్టీ ఆఫీసులో ఆవిష్కరించి మాట్లాడారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పనిగంటలు పెంచి కార్మికుల శ్రమను దోచుకుంటున్నారని విమర్శించారు. మే 1న అంతర్జాతీయ శ్రామిక దినోత్సవం సందర్భంగా గ్రామాల్లో ఎర్రజెండాలు ఎగురవేయాలని కోరారు. సీపీఎం జిల్లా కార్యదర్శి మూశం రమేశ్, ఎగమంటి ఎల్లారెడ్డి, జువ్వాజి విమల, కోడం రమణ, గన్నేరం నర్సయ్య, గణేశ్, పద్మ, రమేశ్చంద్ర పాల్గొన్నారు.