
సైబర్ నేరగాడి అరెస్ట్
సిరిసిల్లక్రైం: దేశవ్యాప్తంగా ఆన్లైన్ సెంటర్లు లక్ష్యంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాడిని సోమవారం రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపారు. మహారాష్ట్రలోని భీవండికి చెందిన దాసరి మురళి మరో నలుగురు ముఠాగా ఏర్పడి ఆన్లైన్ సెంటర్లను లక్ష్యంగా చేసుకొని సైబర్నేరాలకు పాల్పడ్డారు. నలుగురిని గతంలోనే పోలీసులు అరెస్టు చేయగా దాసరి మురళిని సోమవారం సిరిసిల్లలో అరెస్టు చేశారు. మురళిపై దేశవ్యాప్తంగా 35 ఫిర్యాదులు నమోదుకాగా... రూ.45లక్షల విలువైన సైబర్ నేరాలకు పాల్ప డ్డాడు. మురళి భీవండిలో ఫాస్ట్ఫుడ్ సెంటర్ నడిపించుకునేవాడు. విలాసాలకు అలవాటుపడి సులభమార్గంలో డబ్బు సంపాదించాలనే ఆలోచనతో తన స్నేహితులు విలేశ్పటేల్, చిరగ్ రమేశ్పేతడ్, జింతేంద్ర సోమాభాయ్, నిలేశ్ జై సింగ్లతో ముఠాగా ఏర్పడ్డారు. మొదట ఆన్లైన్ సెంటర్ వ్యక్తులకు కాల్చేసి తనని తాను ఉన్నత స్థాయి వ్యక్తిగా పరిచయం చేసుకునేవాడు. ఆన్లైన్ లావాదేవీలు ఎక్కువగా ఉంటాయని, తమ వాళ్లతో నగదు పంపిస్తానని.. తనకు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయాలని నమ్మించి డబ్బు కాజేసేవాడు. అలా వచ్చిన సొమ్మును ఐదుగురు పంచుకునేవారు. దీనిలో భాగంగానే వేములవాడ పట్టణ పరిధిలోని అగ్రహారంలోని ఓ ఆన్లైన్ సెంటర్ను, సిరిసిల్లలోని ఫాస్ట్ఫుడ్ సెంటర్ను లక్ష్యంగా చేసుకొని దాసరి మురళి మోసం చేశాడు. బాధితులు వేములవాడ పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన వేములవాడ పోలీసులు స్పెషల్ టీమ్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. సాంకేతికత ఆధారంగా విలేశ్పటేల్, చిరగ్ రమేశ్ పేతడ్, జింతేంద్ర సోమాభాయ్, నిలేశ్ జైసింగ్లను గతంలోనే రిమాండ్ చేశారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న మురళి కోసం వేములవాడ టౌన్ ఇన్స్పెక్టర్ వీరప్రసాద్, ఎస్సై రమేశ్, సైబర్ టీమ్ ఆర్ఎస్ఐ జునైద్, కానిస్టేబుళ్లు ఇమ్రాన్, షమీ ఆధ్వర్యంలో స్పెషల్ టీం ఏర్పాటు చేసి సాంకేతికత ఆధారంగా కోరుట్ల బస్ స్టాండ్ వద్ద అరెస్ట్ చేశారు.
ఆన్లైన్ సెంటర్లు లక్ష్యంగా దందా
దేశవ్యాప్తంగా 35 ఫిర్యాదులు
రూ.45లక్షలు మోసం