పరిహారం ఇచ్చి ఆదుకోండి | - | Sakshi
Sakshi News home page

పరిహారం ఇచ్చి ఆదుకోండి

Apr 21 2025 12:57 AM | Updated on Apr 21 2025 12:57 AM

పరిహారం ఇచ్చి ఆదుకోండి

పరిహారం ఇచ్చి ఆదుకోండి

● న్యాయం చేయాలని నిర్వాసితుడి వేడుకోలు

రుద్రంగి(వేములవాడ): నష్టపరిహారం ఇవ్వకుండానే పట్టా భూమిని ఇరిగేషన్‌ అధికారులు లాక్కొని కాలువ పనులు చేపడుతున్నారని రుద్రంగికి చెందిన దయ్యాల నర్సయ్య ఆరోపిస్తున్నాడు. నష్టపరిహారం ఇచ్చే వరకు భూమిలో ఎలాంటి పనులు చేపట్ట వద్దని కోరారు. వివరాలు బాధితుని కథనం ప్రకారం. రుద్రంగిలోని సర్వేనంబర్‌ 428/137లో ఎకరం భూమిని సాగు చేసుకుంటుండగా.. 24 గుంటలకు పట్టా ఉంది. అది నాగారం చెరువులోకి గోదావరి నీటిని తరలించే కాలువలో ముంపునకు గురైంది. 17.5 గుంటలకు నష్టపరిహారం రాగా భూమి మధ్యలో నుంచి కాలువ వెళ్లడంతో మిగిలిన భూమి కూడా పనికిరాకుండా పోతోంది. దీంతోపాటు మరో సర్వేనంబర్‌ 313ఇ/2లో ఒక ఎకరం ఇళ్ల స్థలం, సర్వేనంబర్‌ 340లో 3.5 గుంటలు వ్యవసాయేతర భూమి, సర్వేనంబర్‌ 333ఆ/ ఛలో 6 గుంటలు వ్యవసాయేతర భూమి సూరమ్మ చెరువులకు గోదావరి నీటిని తరలించే కాల్వలో ముంపునకు గురవుతుంది. ఈ భూములకు ఒక్క పైసా కూడా పరిహారం రాలేదు. సర్వే నంబర్‌ 333లో గుంట భూమిని తమకు తెలియకుండానే అధికా రులు పట్టాను తొలగించారని ఆరోపించారు. నష్టపరిహారం ఇవ్వకుండానే భూమిని లాక్కోవడంతో రోడ్డుపై పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. పరిహారం ఇచ్చి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఈ విషయంపై శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఈఈ సంతుప్రకాశ్‌ను ఫోన్‌లో వివరణ కోరేందుకు ప్రయత్నించగా స్పందించలేరు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement