
కారు ఢీకొని వ్యక్తి మృతి
కందుకూరు: జాతీయ రహదారి 167బీపై మంగళవారం తెల్లవారుజామున ముందు వైపు వెళ్తున్న ట్రాక్టర్ను వెనుకవైపు నుంచి కారు ఢీకొనడంతో వ్యక్తి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన మంగళవారం వలేటివారిపాలెం మండలంలోని పోకూరు వద్ద చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లింగసముద్రం మండలం మొగిలిచర్ల గ్రామానికి చెందిన స్వర్ణ చిన్నయ్య(44) అనే రైతు మంగళవారం వేకువజామున పొగాకు బేళ్లు ట్రాక్టర్కు ఎత్తుకుని కందుకూరులోని వేలం కేంద్రానికి తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో కందుకూరు సమీపంలోని పోకూరు గ్రామం వద్దకు చేరుకునే సరికి కదిరి నుంచి కందుకూరు వైపు వస్తున్న కారు వేగంగా వెనుకవైపు నుంచి ట్రాక్టర్ను ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ ఇంజన్ తిరగబడడంతో ట్రాక్టర్ నడుపుతున్న చిన్నయ్య అక్కడిక్కడే మృతి చెందాడు. కారు డ్రైవర్ సలీంబాషతో పాటు, కారులోని వారికి తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కారు ఢీకొని వ్యక్తి మృతి