
కాపులను బీసీల్లో చేర్చాలి
గిద్దలూరు రూరల్: కాపులు, బలిజలను బీసీల్లో చేర్చాలని కోరుతూ చిత్తూరు జిల్లా నుంచి కాపు సమితి నాయకుడు ప్రసాద్ గత 15 రోజులుగా పాదయాత్ర చేస్తూ మంగళవారం గిద్దలూరు చేరుకున్నారు. పట్టణంలోని బలిజ సంఘం కార్యాలయం వద్ద కాపు నాయకులు ఆయనను కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కాపు సంఘం నాయకులు మాట్లాడుతూ.. కాపులు, బలిజలను బీసీల్లో చేర్చి రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ చిత్తూరు జిల్లా నుంచి అమరావతి వరకు పాదయాత్ర నిర్వహించడం అభినందనీయమన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను కలిసి కాపులను బీసీల్లో చేర్చాలని వినతి పత్రాన్ని అందజేస్తామని ప్రసాద్ తెలిపారు. కార్యక్రమంలో కాపు సంఘ నాయకులు రంగసుబ్బయ్య, పసుపులేటి శ్రీను, దుత్తా బాలఈశ్వరయ్య, గిరి తదితరులు పాల్గొన్నారు.