
అండర్–18 కబడ్డీ పోటీలకు సింగరాయకొండ విద్యార్థిని
సింగరాయకొండ: ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ అండర్–18 బాలికల కబడ్డీ పోటీలకు సింగరాయకొండలోని ఏఆర్సీ జీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని కుర్రు త్రిగుణ ఎంపికై నట్లు పీడీ కె.శంకర్రావు తెలిపారు. ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో ఈనెల 28 నుంచి జూలై ఒకటో తేదీ వరకు జరిగే జాతీయ కబడ్డీ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ తరఫున త్రిగుణ ప్రాతినిధ్యం వహిస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమెను ప్రిన్సిపాల్ ఎం.సౌజన్య, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు అభినందించారు. కాగా తనను ప్రోత్సహించిన గొల్లపాలెం ఉన్నత పాఠశాల పీడీ హజరత్తయ్య, కళాశాల పీడీ శంకర్రావుకు త్రిగుణ కృతజ్ఞతలు తెలియజేసింది.