బంగారు బాల్యం సర్వే 10 రోజుల్లో పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

బంగారు బాల్యం సర్వే 10 రోజుల్లో పూర్తి చేయాలి

Jun 25 2025 1:17 AM | Updated on Jun 25 2025 1:17 AM

బంగారు బాల్యం సర్వే 10 రోజుల్లో పూర్తి చేయాలి

బంగారు బాల్యం సర్వే 10 రోజుల్లో పూర్తి చేయాలి

● సమస్యల బారిన పడే చిన్నారుల గుర్తింపును వేగవంతం చేయాలి ● కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా

ఒంగోలు సబర్బన్‌: బంగారు బాల్యం యాప్‌ ఆధారిత సర్వేను పది రోజుల్లోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ ఏ.తమీమ్‌ అన్సారియా ఆదేశించారు. తన క్యాంపు కార్యాలయం నుంచి డివిజన్‌, మండల స్థాయి అధికారులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వివిధ సమస్యల బారిన పడే (వల్నరబుల్‌) చిన్నారుల గుర్తింపుతో పాటు ఆధార్‌ కార్డుల రిజిస్ట్రేషన్‌, బడి వయసు పిల్లలు అందరూ బడిలో ఉండేలా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు కలెక్టర్‌ దిశా నిర్దేశం చేశారు. ప్రతి పాఠశాలలో ఈ తరహా పిల్లలను గుర్తించే బాధ్యతను నోడల్‌ ఆఫీసర్‌గా ఒక టీచరుకు అప్పగించాలని ఆమె చెప్పారు. ఆధార్‌ కార్డు లేని ఆరేళ్లలోపు పిల్లలు కూడా ఆధార్‌ కార్డులు పొందేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. జనన ధ్రువీకరణ పత్రాలు లేక ఆధార్‌ కార్డులు పొందలేకపోతున్న వారిని గుర్తించి, ఈనెల 27వ తేదీన జనన ధ్రువీకరణ పత్రాలు పొందేందుకు అర్హులతో దరఖాస్తు చేయించాలని ఆదేశించారు. బడి వయసు కలిగిన పిల్లలు సుమారు 13 వేల మంది ఇప్పటికీ బడి వెలుపల ఉన్నారని, వీరందరినీ తిరిగి పాఠశాలల్లో చేర్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వచ్చే నెల 1,2,3 తేదీల్లో ఒకటి, రెండు, మూడవ తేదీల్లో జిల్లాలోని అన్ని పాఠశాలల్లో గుడ్‌ టచ్‌–బ్యాడ్‌ టచ్‌, ఫోక్సో చట్టం, లైంగిక వేధింపులపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈవో చిరంజీవి, డీఈఓ కిరణ్‌ కుమార్‌, ఐసీడీఎస్‌ పీడీ సువర్ణ, డీసీపీఓ దినేష్‌ కుమార్‌, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి లక్ష్మానాయక్‌ పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో మార్కాపురం సబ్‌ కలెక్టర్‌ సహదిత్‌ వెంకట్‌ త్రివినాగ్‌, కనిగిరి ఆర్డీవో కేశవర్ధన్‌ రెడ్డి , ఒంగోలు ఆర్డీవో లక్ష్మి ప్రసన్న , నోడల్‌ ఆఫీసర్‌ గిరిధర్‌ శర్మ, ఎంపీడీవోలు, సీడీపీఓలు, మున్సిపల్‌ కమిషనర్లు, ఎంఈఓలు, హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్లు, మహిళా సంరక్షణ కార్యదర్శులు హాజరయ్యారు.

రేపు ఫెన్సింగ్‌ జిల్లా క్రీడాకారుల ఎంపిక

ఒంగోలు: ఫెన్సింగ్‌ ఉమ్మడి ప్రకాశం జిల్లాస్థాయి క్రీడాకారుల ఎంపిక ఈనెల 26న నిర్వహిస్తున్నట్లు ప్రకాశం జిల్లా ఫెన్సింగ్‌ అసోసియేషన్‌ కార్యదర్శి జి.నవీన్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపిక మినీ స్టేడియంలో ఉదయం 8 గంటలకు జరుగుతుంది. అండర్‌ 10 కేటగిరీలో పాల్గొనేందుకు 2016 జనవరి 1వ తేదీ, అండర్‌ 12 కేటగిరీలో పాల్గొనేందుకు 2014 జనవరి 1వ తేదీ తరువాత జన్మించిన వారు మాత్రమే అర్హులు. ఫెన్సింగ్‌ అసోసియేషన్‌ గుర్తింపు కార్డు, ఆధార్‌ కార్డు, సొంత కిట్టుతో ఎంపికకు హాజరుకావాలి. పూర్తి వివరాలకు సెల్‌ నంబర్‌ 7671991147 లేదా 9182366146లను సంప్రదించాలని కార్యదర్శి జి.నవీన్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement