జాయింట్ కలెక్టర్ రోణంకి గోపాల కృష్ణ
ఒంగోలు సబర్బన్: పారదర్శకమైన ఓటరు జాబితాలను రూపొందించడంలో రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాల కృష్ణ పేర్కొన్నారు. మంగళవారం ఒంగోలు కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో జేసీ పాల్గొని ఓటరు జాబితాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఎల్ఓ యాప్ నిర్వహణ, ఓటర్ జాబితా రూపకల్పన, పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ ప్రక్రియ తదితర అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు.
ఎన్నికల సంఘం జారీచేసిన మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలన్నారు. తొలుత బీఎల్ఓ యాప్ నిర్వహణ, ఓటర్ జాబితా రూపకల్పన, పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ ప్రక్రియపై కేంద్ర ఎన్నికల సంఘం జారీచేసిన మార్గదర్శకాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈఆర్ఓలకు, ఏఈఆర్ఓలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మార్కాపురం సబ్ కలెక్టర్ సహదీత్ వెంకట త్రివినాగ్, డీఆర్వో చిన ఓబులేసు, ఒంగోలు, కనిగిరి ఆర్డీఓలు లక్ష్మిప్రసన్న, కేశవర్ధన్ రెడ్డి, ఈఆర్ఓలు కుమార్, సత్యనారాయణతో పాటు జిల్లాలోని ఎఈఆర్ఓలు, తదితరులు పాల్గొన్నారు.
రమాదేవికి నేషనల్ ఎడ్యుకేషనల్ ఇన్నోవేటివ్ శిక్షా రత్న అవార్డు
టంగుటూరు: మండలంలోని జమ్ములపాలెం మండల పరిషత్ మోడల్ ప్రైమరీ స్కూల్ ఉపాధ్యాయిని కురుమేటి రమాదేవి నేషనల్ ఎడ్యుకేషనల్ ఇన్నోవేటివ్ శిక్షా రత్న అవార్డును సాధించారు. ఈ అవార్డును ఛత్తీస్గడ్ కి చెందిన నవాచారి గతి విద్యా సమూహ్ సంస్థ వారు అందజేశారు. ఈ సందర్భంగా టంగుటూరు మండల ఎంఈఓలు చెంచు పున్నయ్య, బాలాజీ జమ్మలపాలెం హైస్కూల్ హెడ్మాస్టర్ రాంబాబు, మోడల్ ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అభినందించారు. వినూత్న రీతిలో పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయులని ఎంపిక చేసి నవాచారి గతి విద్యాలయ సంస్థ వారు అవార్డు అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తొమ్మిది మంది ఉపాధ్యాయులను ఎంపిక చేశారు. అందులో రమాదేవి ఒకరు. సర్టిఫికెట్, మెమొంటోలను పోస్టు ద్వారా పంపారు. అవార్డును టంగుటూరు మండల ఎంఈఓలు చెంచు పున్నయ్య, మహతి బాలాజీ చేతుల మీదుగా అందజేశారు.

పారదర్శకంగా ఓటరు జాబితాలు