ఆగని కనిష్ట ధర పతనం | - | Sakshi
Sakshi News home page

ఆగని కనిష్ట ధర పతనం

Jun 25 2025 1:17 AM | Updated on Jun 25 2025 1:17 AM

ఆగని కనిష్ట ధర పతనం

ఆగని కనిష్ట ధర పతనం

కొండపి: పొగాకు వేలంలో కనిష్ట ధర పతనం ఆగడం లేదు. వేలం ప్రారంభంలో రూ.240 పలికిన కనిష్ట ధర ప్రస్తుతం రూ.160కి పడిపోయింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ధరలు పెరిగితే కనీసం పెట్టుబడులైనా వస్తాయని ఆశతో ఉన్న రైతులకు కనిష్ట ధరల పతనంతో నష్టాల్లో కూరుకుతున్నారు. క్లస్టర్‌ పరిధిలోని చోడవరం, ముప్పవరం గ్రామాలకు చెందిన రైతులు వేలానికి 1019 బేళ్లను తీసుకురాగా 721 బేళ్లను కొనుగోలు చేసి 298 బేళ్లను తిరస్కరించారు. సరాసరి ధర రూ.246.70గా నమోదైంది. వేలాన్ని పొగాకు బోర్డు వైస్‌ చైర్మన్‌ బొట్టపాటి బ్రహ్మయ్య పరిశీలించారు.

టంగుటూరు: స్థానిక పొగాకు వేలం కేంద్రంలో మంగళవారం జరిగిన వేలంలో 292 బేళ్లను వ్యాపారులు తిరస్కరించారు. కమ్మవారిపాలెం, కట్టుబడిపాలెం గ్రామాలకు చెందిన రైతులు 869 బేళ్లను వేలానికి తీసుకురాగా వాటిలో 577 బేళ్లను కొనుగోలు చేశారు. గరిష్ట ధర రూ.280, కనిష్ట ధర రూ.180, సరాసరి రూ.240.26గా నమోదైంది. వేలంలో 25 మంది వ్యాపారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement