రైతులకు వెన్నుపోటు | - | Sakshi
Sakshi News home page
breaking news

రైతులకు వెన్నుపోటు

Jun 9 2025 10:22 AM | Updated on Jun 9 2025 10:22 AM

రైతులకు వెన్నుపోటు

రైతులకు వెన్నుపోటు

కూటమి పాలనలో

ఒంగోలు సిటీ: కూటమి ప్రభుత్వ పాలనలో రైతులకు తీరని అన్యాయం జరుగుతోందని వైఎస్సార్‌ సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జి చుండూరి రవిబాబు ధ్వజమెత్తారు. కంపెనీలతో కుమ్మకై ్క రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టారని మండిపడ్డారు. వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం రైతన్నకు వెన్నుపోటు చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చుండూరి రవిబాబు మాట్లాడుతూ కూటమి పాలనలో ఏ ఒక్క పంటను కొనే నాథుడే లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాది పాలనలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. వైఎస్సార్‌ సీపీ హయాంలో రైతుల ప్రయోజనాల కోసమే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. ప్రతి గ్రామంలోనూ రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి గిట్టుబాటు ధర వచ్చేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. రైతుల జీవితాలకు భద్రత కల్పించేందుకు ఎన్నో చర్యలు తీసుకున్నట్లు వివరించారు. రైతులకు ఏదైనా నష్టం సంభవిస్తే కంపెనీల ద్వారా పరిహారం ఇప్పించారని చెప్పారు. రైతులపై భారం పడకుండా పంటల బీమాను ప్రభుత్వం చేయించిందని తెలిపారు. పంటలకు ఎప్పటికప్పుడు ధరలను నిర్ణయించి రైతు భరోసా కేంద్రంలో మద్దతు ధర బోర్డులు ఏర్పాటు చేశారని తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన ధర కన్నా మార్కెట్‌లో ఎక్కువ ధర వస్తే అక్కడ అమ్ముకునే వెసులుబాటు కల్పించిందని, ఒక వేళ తక్కువ ధర వస్తే ప్రభుత్వమే కొనుగోలు చేసేదని వివరించారు. జగనన్న పాలనలో ఐదేళ్ల పాటు రైతులు ఎంతో సంతోషంగా గడిపారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు నెలకొన్నాయని మండిపడ్డారు.

రైతులకు తీరని అన్యాయం..

చంద్రబాబు అఽధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేశారని, పంటల బీమా లేకుండా చేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేవని మార్కెట్‌లో మాత్రం ధరలు మండిపోతున్నాయని చెప్పారు. కూటమి నేతల పాలనలో రాష్ట్రంలో నల్లబజారు వ్యాపారులు రెచ్చిపోతున్నారన్నారు. పొగాకు రైతుల పరిస్థితి రోజు రోజుకూ మరింత దయనీయంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు నెలలుగా పైగా ధరలు రాక రైతులు అల్లాడిపోతుంటే మంత్రులు వట్టి చేతులతో వచ్చి వెళ్లిపోతున్నారని, నిత్యం మాయమాటలు చెప్పడం మినహా ఒక్క రూపాయి ధర పెరిగింది లేదన్నారు. పొగాకును ప్రభుత్వం కొనుగోలు చేయదని, కంపెనీల ద్వారా కొనుగోలు చేస్తామని మంత్రులు చెప్పడం దుర్మార్గమన్నారు. మంత్రులు చేసిన ప్రకటనతో పొగాకు ధర మరింత పడిపోయిందన్నారు. మంత్రుల పర్యటన తర్యాత పొగాకు ధరలు తగ్గడం వెనక ప్రభుత్వ పెద్దలే వ్యాపారస్తులతో కుమ్మకై ్కయినట్లు అర్థమవుతుందన్నారు. ఓట్లు వేసిన గెలిపించిన రైతులను వెన్నుపోటు పొడవడం దారుణమన్నారు. పొగాకు ధరలు రాక ఇళ్లలోనే నిల్వలు ఉంచుకున్నారని, ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తోందని చెప్పారు. వ్యాపారస్తులైతే నష్టాలు వచ్చాయనీ ఐపీ పెట్టి దివాలా ప్రకటిస్తారని, కానీ ఆత్మాభిమానం కలిగిన రైతులు అప్పులు చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకుంటారని ఆవేదన వ్యక్తం చేశారు. పొగాకు రైతులకు మద్దతుగా ఈ నెల 11న మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పొదిలి పర్యటనకు వస్తున్నారని, జిల్లాలోని రైతులంతా ఈ పర్యటనలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఒంగోలు రూరల్‌ మండల అధ్యక్షుడు మన్నె శ్రీనివాసరావు, రైతు విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మారెడ్డి సుబ్బారెడ్డి, నాగులుప్పలపాడు మండల పార్టీ అధ్యక్షుడు శ్రీమన్నారాయణ, రైతు నాయకులు డాకా పిచ్చిరెడ్డి, శ్రీనివాసరావు, కాకుమాను ఆదిశేషయ్య, జానకి రామిరెడ్డి, నారపురెడ్డి, కొండపి, సంతనూతలపాడు, ఒంగోలుకు చెందిన రైతు నాయకులు పాల్గొన్నారు.

వ్యాపారుల ప్రయోజనం కోసం

రైతులకు తీరని అన్యాయం

కంపెనీలతో కూటమి నేతల కుమ్మక్కు

రోజు రోజుకూ ధరలు దిగజారుతున్నా మాయమాటలతో కాలయాపన

ప్రభుత్వం పట్టించుకోకుంటే రైతులకు ఆత్మహత్యలే గతి

వైఎస్సార్‌ సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జి చుండూరి రవిబాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement