
రైలు ఢీకొని నాలుగు గేదెలు మృతి
● రూ.2 లక్షల ఆస్తినష్టం
కురిచేడు: స్థానిక రైల్వేస్టేషన్లో శనివారం అర్ధరాత్రి గుంటూరు వైపు వెళుతున్న రైలు ఢీకొని నాలుగు గేదెలు మృతి చెందాయి. వివరాల్లోకి వెళితే.. మండలంలోని పడమర గంగవరం పంచాయతీ పరిధిలోని రెడ్డెన్నపల్లి గ్రామానికి చెందిన మన్నెం సుబ్బులకు చెందిన గేదెలను మేత కోసం వదిలివేశారు. శనివారం సాయంత్రానికి ఇంటికి రాకపోవడంతో ఉదయాన్నే వెతగ్గా..స్టేషన్ సమీపంలో మృతి చెంది కనిపించాయి. వీటి విలువ రూ.2 లక్షలు ఉంటుందని బాధితుడు వాపోయాడు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
ముండ్లమూరు(కురిచేడు): రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని ఉల్లగల్లు, వెల్లంపల్లి గ్రామాల మధ్య ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. వెల్లంపల్లి గ్రామానికి చెందిన పోటు పెద కోటయ్య, పాపనబోయిన చిన కోటయ్యలు ద్విచక్రవాహనంపై ఉల్లగల్లు వచ్చి పనులు చూసుకుని తిరిగి గ్రామానికి వెళుతున్నారు. వెల్లంపల్లి గ్రామంలో కోళ్లను చికెన్షాపులకు వేసి తిరిగి దర్శి వెళుతున్న వ్యాన్ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ఉన్న పోటు పెదకోటయ్య కుడి కాలు విరిగిపోగా, పాపనబోయిన చిన్నకోటయ్యకు స్వల్ప గాయాలయ్యాయి. 108 వాహన సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం నిమిత్తం దర్శి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు.
చీమకుర్తి మెయిన్రోడ్డులో ఫ్లెక్సీల విధ్వంసం
● వాహనదారులపై పడటంతో ఇద్దరికి తీవ్ర గాయాలు
చీమకుర్తి: ఆదివారం సాయంత్రం వీచిన బలమైన గాలుల తీవ్రతకు చీమకుర్తి మెయిన్రోడ్డులో ఫ్లెక్సీల విధ్వంసానికి పాదచారులు బెంబేలెత్తిపోయారు. మూడు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు వాహనదారులపై పడటంతో ఇద్దరు వాహనదారులకు తీవ్ర గాయాలయ్యాయి. బస్టాండ్ నుంచి దాదాపు అర కిలోమీటరు దూరంలో మెయిన్రోడ్డుకు ఇరువైపులా కట్టిన ఫ్లెక్సీలు గాలి దెబ్బకు రోడ్డుపై చిందరవందరగా పడ్డాయి. ఫ్లెక్సీలు ఊడి పడుతుండటంతో రోడ్డుపై వెళుతున్న ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. దుకాణాలకు అడ్డంగా కట్టిన ఫ్లెక్సీలను తొలగించాలని స్థానికులు మున్సిపాలిటీ అధికారులకు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని దుకాణాల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీరా ఫ్లెక్సీలు గాలికి ప్రజలపై పడి దెబ్బలు తగిలాయని, మున్సిపాలిటీ అధికారులకు చెప్పినా సకాలంలో ఎవ్వరూ స్పందించకపోవడంతో స్థానిక రోడ్డు మీద దుకాణాల యజమానులే రోడ్డు మీద పడిన ఫ్లెక్సీలను తొలగించుకున్నారు.
రైతులకు రాయితీపై
కిసాన్ డ్రోన్లు
టంగుటూరు:
జిల్లాలో రైతులకు 41 కిసాన్ డ్రోన్లు రాయితీపై అందించనున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాసరావు తెలిపారు. మండలంలోని సూరారెడ్డిపాలెంలో రాయితీపై వ్యవసాయ శాఖ యంత్ర పరికరాలు, కిసాన్ డ్రోన్ల పంపిణీలో ముఖ్య అతిథులుగా మంత్రి స్వామి, మారటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య హాజరయ్యారు. కార్యక్రమంలో ఒంగోలు సబ్ డివిజన్ సహయ వ్యవసాయ సంచాలకుడు రమేష్బాబు, మండల వ్యవసాయ అధికారి స్వర్ణలత, సాంకేతిక వ్యవసాయ అధికారి శ్రీనివాస్ నాయక్, ఎంపీడీఓ దేవసేనకుమారి, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనాథ్, వ్యవసాయ విస్తరణ అధికారులు శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

రైలు ఢీకొని నాలుగు గేదెలు మృతి

రైలు ఢీకొని నాలుగు గేదెలు మృతి

రైలు ఢీకొని నాలుగు గేదెలు మృతి