
నోటికాడ కూడు కాజేశారు
ఈ ఫొటోలో ఉన్న మహిళ పేరు కొత్తపల్లి రాణి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్గా 15 సంవత్సరాలుగా అర్థవీడులో పనిచేస్తున్నారు. రాణి భర్త ఆరేళ్ల క్రితం గుండెపోటుతో చనిపోయారు. ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తూ వచ్చిన జీతంతో తన ముగ్గురు పిల్లలను చదివించుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అయితే, గతేడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీఓ శ్రీనివాసరెడ్డి అకారణంగా రాణిని విధులకు రానివ్వకుండా అడ్డుకున్నారు. కూటమి నేతల ఆదేశాలతో ఆమెను అన్యాయంగా తొలగించి ఇబ్బందులకు గురిచేశారు. 2024 జూన్ నుంచి జీతం కూడా ఇవ్వకుండా నిలిపివేశారు. భర్త కూడా లేని రాణితో పాటు ఆమె ముగ్గురు పిల్లల నోటికాడ కూడు కాజేశారు.