జేఈఈ అడ్వాన్స్‌లో సత్తా చాటారు | - | Sakshi
Sakshi News home page

జేఈఈ అడ్వాన్స్‌లో సత్తా చాటారు

Jun 3 2025 5:47 AM | Updated on Jun 3 2025 5:47 AM

జేఈఈ

జేఈఈ అడ్వాన్స్‌లో సత్తా చాటారు

ఒంగోలు సిటీ: జేఈఈ అడ్వాన్స్‌ 2025 పరీక్ష ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఆల్‌ ఇండియా స్థాయిలో ఒంగోలుకు చెందిన శ్రీ సరస్వతి విద్యా సంస్థల విద్యార్థి ఎం.రఘునాథ్‌ మకని 3వ ర్యాంకు, బేస్తవారిపేట మండలంలోని ఖాజీపురానికి చెందిన మంతు వెంకట రవిచంద్రారెడ్డి ఆల్‌ ఇండియా 8వ ర్యాంక్‌ సాధించారు. పుల్లలచెరువు మండలం ముటుకుల గ్రామానికి చెందిన ఉప్పాల మణికంఠ నాయుడు 630వ ర్యాంకు కైవసం చేసుకున్నాడు. ఒంగోలు శ్రీ సరస్వతి విద్యా సంస్థల విద్యార్థి వి.మణికంఠబాబు 119 వ ర్యాంక్‌, కె.లోకక్రిటి 1343 వ ర్యాంక్‌ సాధించారని ఆల్‌ ఇండియా స్థాయిలో శ్రీసరస్వతి విద్యాసంస్థలకు గుర్తింపు తీసుకురావడానికి సహకరించిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు చైర్మన్‌ రమణారెడ్డి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ ఫలితాల సాధనకు కృషి చేసిన డైరెక్టర్లు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్లు ఎ.గణేష్‌రెడ్డి, ఎ.గంగాశంకరరెడ్డి, సీఈఓ ఎన్‌.వి.సురేష్‌, డీన్స్‌, ప్రిన్సిపాల్‌, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొని ర్యాంకులు సాధించిన విద్యార్ధులకు అభినందనలు తెలిపారు.

● జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2025 పరీక్ష ఫలితాల్లో శ్రీ ప్రతిభ విద్యార్థి కాటూరి హరినాథ్‌ ఆల్‌ఇండియా స్థాయిలో 994 (ఎస్సీ కేటగిరీలో) ర్యాంకు సాధించినందుకు ప్రతిభ విద్యాసంస్థల చైర్మన్‌ నల్లూరి వెంకటేశ్వరరావు, వైస్‌ చైర్మన్‌ నల్లూరి సీతారామాంజనేయులు, సీఈఓ నల్లూరి జయప్రకాశ్‌నారాయణ్‌, అధ్యాపకులు, సిబ్బంది ప్రత్యేక అభినందనలు తెలిపారు.

● ఆర్‌.వి.హాసిని ఆల్‌ ఇండియా స్థాయిలో 2237వ ర్యాంకు సాధించింది. తండ్రి ఆర్‌సీహెచ్‌ కృష్ణారెడ్డి జలవనరుల శాఖలో ఉద్యోగిగా, ఎన్‌జీఓ సంఘ నాయకునిగా ఉన్నారు. తల్లి ఎం.జ్యోతి ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు.

● ఉమామహేశ్వర జూనియర్‌ కళాశాల విద్యార్థిని దాసరి యామిని ఆల్‌ ఇండియా స్థాయిలో 3837 (ఎస్సీ కేటగిరీ) లో సాధించినందుకు డైరెక్టర్స్‌ సి.మల్లేశ్వరరావు, సి.జయలక్ష్మి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

● జేఈఈ అడ్వాన్స్‌డ్‌ లో ఒంగోలు ఎస్‌.ఆర్‌ కళాశాల విద్యార్థి దాసరి గగన్‌కుమార్‌కు జాతీయ స్థాయిలో 1857 వ ర్యాంక్‌ సాధించినందుకు అకడమిక్‌ డీన్‌ అరవింద్‌, జోనల్‌ ఇన్‌చార్జ్‌ బి.శ్రీనివాస్‌, డీన్‌ శంకరరావు, ప్రిన్సిపాల్‌ కె.బాలరాజు, అధ్యాపక బృందం అభినందనలు తెలిపారు.

జేఈఈ అడ్వాన్స్‌లో సత్తా చాటారు1
1/3

జేఈఈ అడ్వాన్స్‌లో సత్తా చాటారు

జేఈఈ అడ్వాన్స్‌లో సత్తా చాటారు2
2/3

జేఈఈ అడ్వాన్స్‌లో సత్తా చాటారు

జేఈఈ అడ్వాన్స్‌లో సత్తా చాటారు3
3/3

జేఈఈ అడ్వాన్స్‌లో సత్తా చాటారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement