రోడ్డున పడిన సచివాలయ ధ్రువీకరణ పత్రాలు! | - | Sakshi
Sakshi News home page

రోడ్డున పడిన సచివాలయ ధ్రువీకరణ పత్రాలు!

May 23 2025 3:05 PM | Updated on May 23 2025 3:05 PM

రోడ్డ

రోడ్డున పడిన సచివాలయ ధ్రువీకరణ పత్రాలు!

కొమరోలు: గ్రామ సచివాలయంలో ఉండాల్సిన సచివాలయ ఖాళీ ధ్రువీకరణ పత్రాలు రోడ్డునపడ్డాయి. కొమరోలు మండలంలోని పురుషోత్తమునిపల్లె గ్రామ రహదారికి ఇరువైపులా కిలోమీటరు మేర ధ్రువీకరణ పత్రాలు చెల్లాచెదురుగా పడిఉన్నాయి. ఓ పొలంలో వందలకొద్ది ఖాళీ బాండ్‌ పేపర్లు పడి ఉండటాన్ని అటువైపుగా వెళ్తున్న ప్రజలు చూసి విస్తుపోయారు. ప్రజలకు అవసరమైన కుల, ఆదాయ, జనన, మరణ తదితర ధ్రువీకరణ పత్రాలను గ్రామ సచివాలయంలో ఈ బాండ్‌ పేపర్‌ మీదనే ప్రింట్‌ తీసి ఇస్తారు. ఈ మార్గానికి సమీపంలో సచివాలయం లేకపోవడంతో ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఏ గ్రామ సచివాలయానికి చెందినవని స్థానికులు చర్చించుకుంటున్నారు.

రోడ్డున పడిన సచివాలయ ధ్రువీకరణ పత్రాలు! 1
1/1

రోడ్డున పడిన సచివాలయ ధ్రువీకరణ పత్రాలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement