వెరిటాస్‌ సైనిక్‌ స్కూల్‌కు భారత ప్రభుత్వం అనుమతి | - | Sakshi
Sakshi News home page

వెరిటాస్‌ సైనిక్‌ స్కూల్‌కు భారత ప్రభుత్వం అనుమతి

May 12 2025 6:51 AM | Updated on May 12 2025 6:51 AM

వెరిటాస్‌ సైనిక్‌ స్కూల్‌కు భారత ప్రభుత్వం అనుమతి

వెరిటాస్‌ సైనిక్‌ స్కూల్‌కు భారత ప్రభుత్వం అనుమతి

తిరుపతి కల్చరల్‌: తిరుపతిలో 22 ఏళ్లుగా బీఎస్‌ఆర్‌ విద్యాసంస్థల ద్వారా క్రమశిక్షణతో కూడి విద్యతో పాటు వేలాది మంది విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఇటు విద్యార్థుల ఉన్నతికి, దేశ రక్షణకు అందిస్తున్న సేవలను గుర్తించి భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్‌ డిఫెన్స్‌ సైనిక్‌ స్కూల్‌ అనుమతి పొందినట్లు వెరిటాస్‌ సైనిక్‌ స్కూల్‌ చైర్మన్‌ డాక్టర్‌ బి.శేషారెడ్డి తెలిపారు. శనివారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ విద్యాసంస్థల ద్వారా ఇప్పటికే సుమారు 20 వేల మంది విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించడంతో పాటు 6 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని తెలిపారు. అందరి సహకారంతో భారత రక్షణ దళానికి ఎంతో మంది సైనికులను అందించేలా కృషి చేశామన్నారు. వెరిటాస్‌ సైనిక్‌ స్కూల్‌ స్థాపించినప్పటి నుంచి అనుభజ్ఞులైన వారితో అత్యుత్తమమైన విద్యాప్రమాణాలతో విద్యార్థులకు విద్యతో పాటు శారీరక మానసిక, మానవీయ విలువలతో కూడిన విద్యను అందిస్తూ ఆదరణ పొందామన్నారు. భారత ప్రభుత్వం గుర్తింపుతో మరింత బాద్యతగా దేశ భద్రత కోసం వెరిటాస్‌ సైనిక్‌ స్కూల్‌ ముందడుగు వేస్తోందన్నారు. ఉన్నత అధికారులుగా విద్యార్థులను ఎదిగేందుకు అవసరమైన ఉన్నత ప్రమాణాల విద్యను అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. రాబోవు కాలంలో ప్రభుత్వ సైనిక్‌ స్కూలు అనుసంధానంతో కరికులం, యాక్టివిటీస్‌, కాంపిటీషన్స్‌ వంటి అన్ని సైనిక్‌ స్కూల్‌ సొసైటీ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. దేశానికి అవసరమైన విద్యను యువతకు డిపెన్స్‌ రంగగాల్లో ఎన్‌డీఏ, టీఈఎస వంటి ఉత్తమ ఉద్యోగ అవకాశాలను కేవలం 17 ఏళ్ల వయసులోనే పొందే విధంగా తీర్చిదిద్దాలని సంకల్పించామన్నారు. వెరిటాస్‌ స్కూల్లో చదువుకున్న ప్రతి విద్యార్థి దేశంపై, సమాజంపై బాధ్యతగా ఉండేలా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఇకపై ఆలిండియా సైనిక్‌ స్కూల్‌ ఎంట్రన్స్‌ పరీక్షల ద్వారా కౌన్సిలింగ్‌ నిర్వహించి సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు. విద్యాసంస్థలో ప్లస్‌–1 ఇంటర్మీడియెట్‌తో స్పెషల్‌ ఎన్‌డీఏను ప్రారంభిస్తున్నామని, ఈ అవకాశాన్ని ఆసక్తి ఉన్నవారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 22 ఏళ్లుగా తమకు సంస్థ అభివృద్ధికి సహకరించిన విద్యార్థులు, తల్లిదండ్రులకు, అధ్యాపకులు, అధ్యాపకేతురులకు ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో వైరిటాస్‌ సైనిక్‌ స్కూల్‌ డైరెక్టర్లు బి.శ్రీకర్‌రెడ్డి, బి.సందీప్‌రెడ్డి పాల్గొన్నారు.

దేశ రక్షణకు విద్యార్థులను తయారు చేయడమే వెరిటాస్‌ లక్ష్యం

వెరిటాస్‌ సైనిక్‌ స్కూల్‌ చైర్మన్‌ డాక్టర్‌ శేషారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement