హెచ్‌ఎం పదోన్నతుల్లో అవకతవకలు సవరించాలి | - | Sakshi
Sakshi News home page

హెచ్‌ఎం పదోన్నతుల్లో అవకతవకలు సవరించాలి

May 4 2025 7:03 AM | Updated on May 4 2025 7:03 AM

హెచ్‌ఎం పదోన్నతుల్లో అవకతవకలు సవరించాలి

హెచ్‌ఎం పదోన్నతుల్లో అవకతవకలు సవరించాలి

ఒంగోలు సిటీ: స్కూల్‌ అసిస్టెంట్‌ నుంచి హెడ్మాస్టర్‌ పదోన్నతుల జాబితాలో అవకతవకలు సవరించాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు డీఈఓ కిరణ్‌కుమార్‌ను కోరారు. స్థానిక ఎస్‌ఎస్‌ఏ కార్యాలయంలో ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల నాయకులతో శనివారం డీఈఓ కోఆర్డినేషన్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితా, జీవో నంబర్‌ 117 తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడుతూ స్కూల్‌ సిస్టెంట్‌ నుంచి హెచ్‌ఎంల పదోన్నతుల గురించి చర్చించారు. ఉర్దూ మైనర్‌ మీడియం సెక్షన్‌ కొనసాగించాలని, ఉర్దూ ఎస్జీటీ పోస్టును ఉంచాలని కోరారు. మార్కాపురం మున్సిపాలిటీ స్కూల్‌ అసిస్టెంట్‌ సోషల్‌ సీనియార్టీ లిస్టులో లోపాలను డీఈవో దృష్టికి తీసుకెళ్లగా వెంటనే పరిష్కరిస్తామని చెప్పారు. ఇటీవల మెడికల్‌ సర్టిఫికెట్ల జారీకి రిమ్స్‌లో ఏర్పాటు చేసిన మూడు రోజుల శిబిరానికి హాజరుకాలేని వారికి మరో సారి అవకాశం కల్పించాల్సిందిగా ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరారు. కమిషనర్‌ నుంచి ప్రొసీడింగ్‌ వచ్చిన వెంటనే అవకాశం కల్పిస్తామని డీఈఓ చెప్పారు. సమావేశంలో యూటీఎఫ్‌ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కొమ్మోజు శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షుడు షేక్‌ అబ్దుల్‌ హై, లక్ష్మీనారాయణ, ఏపీటీఎఫ్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జనార్దన్‌ రెడ్డి, శ్రీనివాసులు, పీవీ.సుబ్బారావు, పీఆర్‌టీయూ నాయకులు శ్రీనివాసరావు, ఎస్టీయూ నాయకులు చల్లా శ్రీను, నరసింహారెడ్డి, టీఎన్‌యూఎస్‌ నాయకులు ఆంజనేయులు, పండిత పరిషత్‌ నాయకులు రఘు, ఎస్‌ఏఎపీ నుంచి రఫీ, బీటీఏ నాయకులు వెంకట్రావు, మల్లిఖార్జునరావు, దిలీప్‌ చక్రవర్తి, ఏడీ లు వరప్రసాద్‌, ఉదయ భాస్కర్‌, సూపరింటెండెంట్‌ కిరణ్‌ కుమార్‌ రెడ్డి, రమణయ్య, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement