
నిబంధనలకు విరుద్ధంగా సిట్టింగులు
మద్యం విక్రయాల విషయంలో నిబంధనలను ఖాతరు చేయడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. దాదాపుగా జిల్లా అంతటా మద్యం దుకాణాల్లో మందుబాబుల కోసం సిట్టింగులు ఏర్పాటు చేశారు. సౌకర్యాన్ని బట్టి మద్యం దుకాణానికి వెనక వైపు కుర్చీలు వేసి కూర్చోబెట్టి తాగిస్తున్నారు. చివరికి బెల్టుషాపుల్లో కూడా సిట్టింగు పెట్టి వ్యాపారం చేస్తున్నారు. అయినా ఎకై ్సజ్ శాఖ అధికారులు ఎలాంటి తనిఖీలు చేయడం లేదన్న విమర్శలు వినవస్తున్నాయి. మార్కాపురం ఎకై ్సజ్ ఏఈఎస్ మీద విపరీతంగా ఆరోపణలు వినవస్తున్నాయి. నిబంధనలకు వ్యతిరేకంగా మద్యం విక్రయిస్తున్న దుకాణాల మీద చర్యలు తీసుకోకుండా ముడుపులు తీసుకొని వెళ్లిపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.