
వైఎస్సార్ సీపీ పటిష్టతపై దృష్టి సారించండి
● నాయకులు, కార్యకర్తలకు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు పిలుపు
మార్కాపురం: వైఎస్సార్ సీపీ పటిష్టతపై దృష్టి సారించాలని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలకు మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు పిలుపునిచ్చారు. స్థానిక పార్టీ కార్యాలయంలో మార్కాపురం నియోజకవర్గ ముఖ్య నాయకులతో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామస్థాయి నుంచి పార్టీ అభివృద్ధిపై దృష్టిపెట్టాలన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో సీఎంగా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు, పార్టీలకు అతీతంగా ప్రజలకు అందించిన తీరును వివరించాలన్నారు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందాయన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యాలు, ఆలోచనలకు అనుగుణంగా ముందుకు వెళ్దామన్నారు. ప్రతి కార్యకర్తకూ తాను అందుబాటులో ఉంటానని, ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. పార్టీలో కష్టపడిన వారికి కచ్చితంగా గుర్తింపు ఉంటుందని తెలిపారు. తాను ప్రతి వైఎస్సార్ సీపీ కార్యకర్తను గుర్తిస్తానన్నారు. కార్యకర్తలు నిరాశ, నిస్పృహలు వీడాలని సూచించారు. అందరం ఐకమత్యంగా ఉండి పార్టీని బలోపేతం చేద్దామని పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలను గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషిచేద్దామన్నారు.
పహల్గామ్ మృతులకు
ఘన నివాళులు...
కాశ్మీర్లోని పర్యాటక ప్రాంతమైన పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిని మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఖండించారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. మృతుల ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉగ్రవాదులపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చిర్లంచర్ల బాలమురళీకృష్ణ, వైఎస్సార్ సీపీ ఇంటలెక్చువల్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి మేడా బద్రీనాఽథ్, ఏఎంసీ మాజీ చైర్మన్ గొలమారి శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్–2 అంజమ్మ శ్రీనివాసులు, కౌన్సిలర్లు బుశ్శెట్టి నాగేశ్వరరావు, కొత్త కృష్ణ, చాటకొండ చంద్ర, సలీమ్, పార్టీ నాయకులు ఇస్మాయిల్, సురేష్, గుంటక చెన్నారెడ్డి, బొగ్గరపు శేషయ్య, సుంకయ్య, మందటి మహేశ్వరరెడ్డి, డీవీఆర్, బోడపాడు రమణారెడ్డి, కొండలు, కాల్వ దుర్గ, చాంద్బాషా, ఉస్మాన్, పి.విజయలక్ష్మి, సోషల్ మీడియా రఫీ, సీఎం ఖాశీం తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్ సీపీ పటిష్టతపై దృష్టి సారించండి