
మలేరియా నియంత్రణ అందరి బాధ్యత
ఒంగోలు సబర్బన్: మలేరియా నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యత అని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ప్రకాశం భవన్ వద్ద అవగాహన ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న వారితో మలేరియా నియంత్రణపై ప్రతిజ్ఞ చేయించారు. కలెక్టరేట్ నుంచి నెల్లూరు బస్టాండ్ వరకు ర్యాలీ సాగింది. కలెక్టర్ మాట్లాడుతూ.. పరిసరాల పరిశుభ్రతపై అందరూ శ్రద్ధ చూపాలన్నారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మలేరియా నిర్ధారణ సౌకర్యాలు, చికిత్సకు అవసరమైన ఏర్పాట్లు ఉన్నాయని చెప్పారు. ర్యాలీలో డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వరరావు, జిల్లా మలేరియా అధికారి డాక్టర్ మధుసూదన్రావు, ఆశా వర్కర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
కలెక్టర్ తమీమ్ అన్సారియా