
గంజాయి విక్రేతలపై పీడీ యాక్ట్
● ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టర్ రాహుల్దేవ్ శర్మ
మార్కాపురం: గంజాయి విక్రయించే వారిపై, పదే పదే గంజాయి కేసులో అరెస్టు అయిన వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని ప్రొహిబిషన్, ఎకై ్సజ్ ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టర్ రాహుల్దేవ్ శర్మ అధికారులను ఆదేశించారు. ఏఈఎస్ కార్యాలయాన్ని మంగళవారం తనిఖీ చేశారు. మార్కాపురం, కంభం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి ఎకై ్సజ్ స్టేషన్ల సీఐలతో నాటుసారా, గంజాయి, నాన్ డ్యూటీపెయిడ్ మద్యంపై సమీక్ష నిర్వహించారు. నాటుసారా తయారుచేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పదే పదే ఈ కేసుల్లో అరెస్టు అయ్యేవారిపై పీడీ యాక్టు పెట్టాలన్నారు. డిప్యూటీ కమిషనర్ హేమంత నాగరాజు, ఎన్ఫోర్సుమెంట్ అసిస్టెంట్ కమిషనర్ కె.విజయ, ఎస్టీఎఫ్ అసిస్టెంట్ కమిషనర్ సుధాకర్రెడ్డి, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఖాజా మొహిద్దీన్, మార్కాపురం ఏఈఎస్ బాలయ్య, సీఐ వెంకటరెడ్డి, ఎస్సై గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.