అమరావతిని మార్చడం లేదు | Vellampalli Srinivas Comments On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

అమరావతిని మార్చడం లేదు

Aug 9 2020 5:50 AM | Updated on Aug 9 2020 5:50 AM

Vellampalli Srinivas Comments On Chandrababu Naidu - Sakshi

వన్‌టౌన్‌ (విజయవాడ పశ్చిమ): రాజధానిగా అమరావతిని మార్చడం లేదని, దీనికి అదనంగా మరో రెండు రాజధానులను ఏర్పాటు చేస్తున్నామని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. విజయవాడలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే..

► అసమానతలకు తావు లేకుండా అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని ప్రభుత్వం భావిస్తోంది. 
► రాష్ట్రంలో వికేంద్రీకరణతో మూడు ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని మేనిఫెస్టోలో పెట్టాం. దాన్నే అమలు చేస్తున్నాం.
► కానీ చంద్రబాబు నిరంతరం ప్రజలను పక్కదోవ పట్టించే ప్రకటనలు చేస్తూ మోసం చేస్తున్నారు. ఆర్డినెన్స్‌ వచ్చినప్పటి నుంచి యాగీ చేయడమే పనిగా పెట్టుకున్నారు. అమరావతిని తరలిస్తున్నామని మాయమాటలతో అందరినీ మోసపుచ్చుతున్నారు. ఆయన జీవితమంతా మోసం చేయడమే. 
► చంద్రబాబు అమరావతి పేరుతో గ్రాఫిక్స్‌ చూపించారు.. అభివృద్ధిని పట్టించుకోలేదు. వాస్తవ అభివృద్ధిని సీఎం వైఎస్‌ జగన్‌ చూపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement