అసెంబ్లీకి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు | BRS MLAs To Assembly For Defecting MLAs Issue | Sakshi
Sakshi News home page

అసెంబ్లీకి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు

Sep 15 2025 3:29 PM | Updated on Sep 15 2025 5:10 PM

BRS MLAs To Assembly For Defecting MLAs Issue

హైదరాబాద్‌:  తెలంగాణ రాష్ట్రంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యహహారంపై అటు అధికారం కాంగ్రెస్‌- ఇటు ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ల మధ్య గత కొన్ని రోజులుగా మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తమ పార్టీ నుంచి గెలిచి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్‌ డిమాండ్‌ చేస్తుండగా, ఆ  ఎమ్మెల్యేలు మాత్రం తాము పార్టీ మారలేదని అంంటున్నారు.  తాము నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్‌రను కలిశామని వారు అందుకున్న నోటీసులకు సమాధానంగా పేర్కొన్నారు. 

అయితే తమ పార్టీ నుంచి గెలిస్తే బీఆర్‌ఎస్‌ చేపట్టే కార్యక్రమిలకు వారు ఎందుకు దూరంగా ఉంటున్నారని బీఆర్‌ఎస్‌ ప్రశ్నిస్తోంది. దీన్ని సుప్రీంకోర్టులోనే తేల్చుకుంటామని స్పష్టం చేసింది. ఇదిలా ఉంచితే. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌లో భాగంగా ఆ ఎమ్మెల్యేల సమాధానంపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అసెంబ్లీ అదనపు కార్యదర్శికి వివరణ ఇచ్చారు. 

దీనిలో భాగంగా ఈరోజు(సోమవారం, సెప్టెంబర్‌ 15వ తేదీ) అసెంబ్లీకి వచ్చిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు.. స్పీకర్‌ అందుబాటులో లేకపోవడంతో అసెంబ్లీ కార్యదర్శికి పలు ఆదారాలు సమర్పించారు.  పార్టీ మారిన ఎమ్మెల్యేలు అధికారిక కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఆధారాలు, కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పాల్గొన్న మరిన్ని ఆధారాలను అసెంబ్లీ కార్యదర్శికి సమర్పించారు. అసెంబ్లీకి వచ్చిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల్లో జగదీష్‌రెడ్డి, వివేక్‌ గౌడ్‌ చింతా ప్రభాకర్‌ తదితరులు ఉన్నారు.

అసెంబ్లీ జాయింట్ సెక్రటరీని కలసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

అనంతరం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి  అసెంబ్లీ మీడియా  పాయింట్‌ వద్ద మాట్లాడుతూ.. ‘ వాళ్లు బీఆర్‌ఎస్‌లో ఉంటే ాపార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. వాళ్లు బీఆర్‌ఎస్‌లో ఉంటే రాహుల్‌ గాంధీని ఎందుకు కలిశారు. సీఎం రేవంత్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు  కాంగ్రెస్‌ కండువా కప్పుకుని తిరుగుతూ జాతీయ జెండా అని చెబుతున్నారు. బీఆర్‌ఎస్‌లో ఉంటే కేసీఆర్‌తో ఉండాలి కదా?’ అని ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement
Advertisement