రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం

BJP Leader Kishan Reddy Comments On BRS And Congress - Sakshi

బీఆర్‌ఎస్‌పై ప్రజలు తిరగబడుతున్నారు 

అందరికీ న్యాయం చేసేలా మా మేనిఫెస్టో 

కర్ణాటకలో కాంగ్రెస్‌ 5 గ్యారంటీలకే దిక్కులేదు..తెలంగాణలో 6 ఎలా అమలు చేస్తుంది 

ఆచరణ సాధ్యం కాని హామీలను ఓట్ల కోసమే ఇచ్చారు 

మీడియాతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ వల్ల తెలంగాణ తీవ్రంగా నష్టపోయిందని, ఆ పార్టీ ప్రజల రక్తం తాగిందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కర్ణాటకలో ఐదు గ్యారంటీలకే దిక్కులేదు.. మరి తెలంగాణలో ఆరు గ్యారంటీలు ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. ‘కాంగ్రెస్‌వి ఫేక్‌ గ్యారంటీలు.. ఆచరణ సాధ్యం కాని హామీలను ఓట్ల కోసమే ఇచ్చారు’అని మండిపడ్డారు. సోమవారం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ పాలనపై ప్రజలు తిరగబడుతున్నారని, తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం రాబోతోందని చెప్పారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అభ్యర్థులకు మంచి ఆదరణ లభిస్తోందని, ముఖ్యంగా యువత నుంచి అత్యధిక మద్దతు లభిస్తోందని చెప్పారు. అందరికీ న్యాయం చేసేలా బీజేపీ మేనిఫెస్టో ఉందని, ఇచ్చిన హామీలన్నింటినీ నెరవెరుస్తామని తెలిపారు. ‘సకల జనుల సౌభాగ్య తెలంగాణ కోసం బీజేపీ ముందుకు వెళ్తుంది. రూ.3,100 మద్దతు ధరకు ధాన్యాన్ని కొంటాం. రైతుల మీద భారం పడకుండా పంటల బీమా అమలు చేస్తాం. వ్యాట్‌ తగ్గించడం ద్వారా పెట్రోల్, డీజిల్‌ ధరలు తగ్గిస్తాము. ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లో మహిళలకు 10 లక్షలు ఉద్యోగాలు కల్పిస్తాం’అని కిషన్‌రెడ్డి చెప్పారు. 

సీఎం కేసీఆర్‌ సింగరేణిని ప్రైవేట్‌పరం చేసి దానిని బీజేపీపై నెట్టే ప్రయత్నం చేశారని, అధికారంలోకి వస్తే సింగరేణిని పటిష్టం చేస్తామని భరోసా వచ్చారు. బీజేపీ అధికారంలోకి రాకపోతే రాష్ట్రం అధోగతి పాలు అవుతుందన్నారు. 

రాహుల్‌ గాంధీ పారిపోయారు.. 
‘పార్టీని నడిపించలేను.. అంటూ కాంగ్రెస్‌నేత రాహుల్‌ గాంధీ విదేశాలకు పారిపోయారు. అలాంటి పార్టీ మాకు నీతులు చెపుతుందా?’అని కిషన్‌రెడ్డి ఎద్దేవాచేశారు. బీసీ సీఎం విషయంలో కాంగ్రెస్‌ పార్టీ తమను అవమానిస్తోందని, కాంగ్రెస్‌కు దుబ్బాక, హుజూరాబాద్, జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో డిపాజిట్‌ రాలేదు.. మరి వాళ్లు ఎలా 6 గ్యారంటీలను అమలు చేస్తామంటున్నారని ప్రశ్నించారు. ‘కేసీఆర్‌ ది ప్యూడలిస్ట్‌ మెంటాలిటీ.. ఒక ప్యూడలిస్ట్‌ పోతే మరో ప్యూడలిస్ట్‌ వస్తాడు. బీఆర్‌ఎస్‌లో ప్రచారం చేస్తోంది ఆ నలుగురే, మిగతా వాళ్లను తిరగనీయరు’అని అన్నారు.

రెడ్డి సామాజికవర్గానికి చెందిన తనను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా ప్రకటించాక, బీసీ నేతను సీఎం చేస్తామని బీజేపీ చెప్పిందన్నారు. ఇదే బీజేపీ సామాజిక న్యాయమన్నారు. కేసీఆర్‌ సర్కార్‌ అవినీతిపై రిటైర్డ్‌ సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపిస్తామని తమ మేనిఫెస్టోలో హామీనిచ్చామని తెలిపారు. అవినీతికి పాల్పడితే ఎంత పెద్ద వారైనా వదిలిపెట్టమన్నారు. ప్రజలు బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లను పాతర వేస్తారని వ్యాఖ్యానించారు. ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ పాల్గొనేలా రాష్ట్రంలో మరో ఆరు సభలు పెట్టాలని నిర్ణయించామని పీఎంఓ, బీజేపీ నాయకత్వం నుంచి ఆమోదం రాగానే వాటిని ఎప్పుడు, ఎక్కడెక్కడ నిర్వహించాలన్నది ప్రకటిస్తామని ఆయన చెప్పారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

21-11-2023
Nov 21, 2023, 04:22 IST
సాక్షి, యాదాద్రి, మిర్యాలగూడ, ఎల్‌బీనగర్‌/మన్సూరాబాద్‌: ‘కాంగ్రెస్‌ నేస్తం కాదు.. భస్మాసుర హస్తం’అని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, ఐటీ శాఖ...
21-11-2023
Nov 21, 2023, 04:15 IST
నర్సాపూర్‌ /పరకాల/బంజారాహిల్స్‌ (హైదరాబాద్‌): ఇందిరమ్మ రాజ్యం అంటే ఆకలి కేకల రాజ్యం కాదని, అన్ని వర్గాల ప్రజలను ఆదుకునే రాజ్యమని...
21-11-2023
Nov 21, 2023, 04:11 IST
గజ్వేల్‌/దుబ్బాకటౌన్‌: బీడీ కట్టల మీద, పాల మీద జీఎస్‌టీ వేసి, గ్యాస్‌ ధరలు పెంచి, వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతామని...
21-11-2023
Nov 21, 2023, 04:07 IST
జనగామ/కోరుట్ల/మెట్‌పల్లి/మల్లాపూర్‌ (హైదరాబాద్‌): బీఆర్‌ఎస్‌ సర్కారు పాలనలో మిషన్‌ పథకాలన్నీ కల్వకుంట్ల కుటుంబానికి కమీషన్ల స్కీంలుగా మారిపోయాయని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి...
20-11-2023
Nov 20, 2023, 16:13 IST
సాక్షి,నర్సాపూర్‌ : నర్సాపూర్ కాంగ్రెస్ నాయకులు నమ్మించి మోసం చేసి పార్టీలు మారారని, కార్యకర్తలు మాత్రం పార్టీ జెండా మోస్తూనే ఉన్నారని టీపీసీసీ...
20-11-2023
Nov 20, 2023, 15:48 IST
సాక్షి, స్టేషన్‌ఘన్‌పూర్‌ : కాంగ్రెస్‌ ధరణిని రద్దు చేసి దాని ప్లేస్‌లో భూమాత అనే స్కీమ్‌ తీసుకొస్తారట కాంగ్రెస్‌ వాళ్లు తెచ్చేది భూమాత...
20-11-2023
Nov 20, 2023, 13:53 IST
ఖమ్మంలో రెండు సామాజిక వర్గాలు ఏటువైపు చూస్తే వారికే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి..
20-11-2023
Nov 20, 2023, 13:34 IST
సాక్షి, కామారెడ్డి: దశాబ్దాలుగా ఆయా నియోజకవర్గాల్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా పాతముఖాలే కనిపించేవి. గెలిచినా, ఓడినా వాళ్లే బరిలో ఉండేవారు....
20-11-2023
Nov 20, 2023, 13:19 IST
సిరిసిల్ల: అది సిరిసిల్ల జిల్లా కేంద్రం. సమయం అర్ధరాత్రి దాటింది. వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. పట్టణ వాసులు నిద్రపోతున్నారు. నేతకార్మికులు...
20-11-2023
Nov 20, 2023, 12:54 IST
హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో మేడ్చల్‌ నియోజకవర్గం ఎంతో మంది ఉద్దండులను రాష్ట్రానికి అందించింది. మర్రి చెన్నారెడ్డి, దేవేందర్‌గౌడ్‌ వంటి రాజకీయ...
20-11-2023
Nov 20, 2023, 12:18 IST
నిర్మల్‌/ఖానాపూర్‌/సాక్షి, ఆసిఫాబాద్‌: ‘కుమురంభీమ్, రాంజీగోండు, సమ్మక్క–సారలమ్మ లాంటి వీరుల భూమి ఇది. జల్‌ జంగల్‌ జమీన్‌ కోసం పోరాడిన గడ్డ...
20-11-2023
Nov 20, 2023, 11:26 IST
రూపురేఖలు మార్చే ఎన్నికలివి.. ‘మిత్రులారా.. మొట్టమొదటగా ఈ ప్రాంత మాతా మాణికేశ్వరి అమ్మవారికి నమస్కరిస్తున్నా.. అభ్యర్థుల పేర్లు ఏదైతే చెప్పినప్పుడు హర్షధ్వానాలతో...
20-11-2023
Nov 20, 2023, 10:43 IST
నాగర్‌కర్నూల్‌/అలంపూర్‌/కొల్లాపూర్‌/కల్వకుర్తి రూరల్‌: కాంగ్రెస్‌ పార్టీకి అధికారం ఇస్తే కరెంట్‌ కష్టాలు తప్పవని, సంక్షేమ పథకాల అమలు ప్రశ్నార్థకమవుతాయని ముఖ్యమంత్రి కల్వకుంట్ల...
20-11-2023
Nov 20, 2023, 09:45 IST
జహీరాబాద్‌: గతంలో నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన ఆరుగురిలో ముగ్గురికి మాత్రం మంత్రివర్గలో చోటు లభించింది. కాంగ్రెస్‌ హయాంలోనే ఎం.బాగారెడ్డి,...
20-11-2023
Nov 20, 2023, 09:14 IST
రాజకీయ పార్టీల్లో వలసల పరంపర కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన నాటి నుంచి జిల్లాలో రాజకీయ పార్టీల్లో ఒక...
20-11-2023
Nov 20, 2023, 08:54 IST
హైదరాబాద్: తాజా ఎన్నికల్లో కొందరు నేతలు పోటీ చేయడం లేదు. అయినా అభ్యర్థులను మించి కష్టపడాల్సి వస్తోంది. ఇందుకు కారణం...
20-11-2023
Nov 20, 2023, 08:53 IST
నియోజకవర్గాల పునర్విభజన అనంతరం 2009, 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన మంచిరెడ్డి కిషన్‌రెడ్డి గెలుపొందారు. ఉమ్మడి రాష్ట్ర...
20-11-2023
Nov 20, 2023, 05:31 IST
ధర్మపురి/పెగడపల్లి/కాటారం: కాంగ్రెస్‌ మాటలు నమ్మి మోసపోవద్దని, బీఆర్‌ఎస్‌ చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని ఎమ్మెల్సీ కవిత ప్రజలను కోరారు....
20-11-2023
Nov 20, 2023, 05:21 IST
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సింగరేణి సంస్థ మనుగడ సాగించాలంటే సీఎం కేసీఆర్‌ ఉండాలి..కేసీఆర్‌ ఉండాలంటే రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌...
20-11-2023
Nov 20, 2023, 05:06 IST
సిద్దిపేటజోన్‌: పక్కనున్న కర్ణాటకలో ఐదు గ్యారంటీలను ప్రకటించిన రాహుల్, ప్రియాంకాగాంధీ పత్తా లేకుండాపోయారని, అక్కడ పరిస్థితి గందరగోళంగా మారిందని మంత్రి...



 

Read also in:
Back to Top