ముదిగొండ: ప్రజా సమస్యలు పరిష్కరించాలని, నిరుద్యోగుల గోడు తీర్చాలని కోరుతూ ప్రగతి భవన్ను బద్దలు కొడతామని కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం ఆయన ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం యడవల్లి నుంచి పీపుల్స్ మార్చ్ పాదయాత్రను చేపట్టారు. స్థానిక శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, సతీమణి నందిని, కుమారుడు విక్రమాదిత్యతో కలసి ముందుకు సాగారు. తొలిరోజు పాదయాత్రకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. తొలిరోజు యాత్ర యడవల్లి నుంచి మాధాపురం, కట్టకూరు, మేడేపల్లి, యడవల్లి లక్ష్మీపురం మీదుగా ముదిగొండ వరకు 18 కిలోమీటర్ల మేర సాగింది. మార్గమధ్యలో పొలాల్లో పని చేసే కూలీలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టి, అక్కడి గోసపై పోరాడుతామని తెలిపారు. సోనియమ్మ ఇచ్చిన తెలంగాణలో ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా కేసీఆర్ పాలన కొనసాగుతుందని విమర్శించారు.
కేసులు పెట్టేందుకు సిగ్గుండాలి..
ఎనిమిదేళ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం గ్రూప్–1, డీఎస్సీ ఉద్యోగ నోటిఫికేషన్ వేయకుండా, ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని ప్రకటించిన కేసీఆర్.. ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. సమస్యలపై ప్రశ్నించే వారిపై సీఎం కేసులు పెట్టిస్తున్నారని, ఉద్యోగ నోటిఫికేషన్లు చేయాలని ఆందోళన చేస్తున్న నిరుద్యోగులపై కేసులు పెట్టి నిర్బంధించడానికి సిగ్గుండాలని విమర్శించారు. ఎనిమిదేళ్ల టీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే ఒక్క పథకమైనా తీసుకొచ్చారా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలను మభ్య పెట్టడానికి కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడుతున్నట్లు సీఎం కేసీఆర్ నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. పాదయాత్రలో మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ప్రగతి భవన్ను బద్దలు కొడతాం
Published Mon, Feb 28 2022 3:06 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement