షిఫ్ట్‌ పద్దతిలో మంత్రులు ఢిల్లీకి.. బండి సంజయ్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Bandi Sanjay Comments On Minister Ktr - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజ్‌పై మంత్రులు మాట్లాడటం లేదు కానీ.. కవిత కోసం మంత్రులు షిఫ్ట్‌ పద్దతిన ఢిల్లీ వెళ్లారంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ మండిపడ్డారు. బుధవారం ఆయన బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పేపర్‌ లీకేజ్‌ కేసులో కేటీఆర్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

ఎలాంటి తప్పు చేయకపోతే సిట్టింగ్‌ జడ్జితో ఎందుకు విచారణ చేయించడం లేదు.. కేటీఆర్‌కు ఎందుకు నోటీసులు ఇవ్వడం లేదంటూ ఆయన ప్రశ్నించారు. ‘‘బీజేపీ అధికారంలోకి రాగానే జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తాం. యువత నిరాశకు గురికావొద్దు. మిలియన్‌ మార్చ్‌ తరహాలో నిరుద్యోగ మార్చ్‌ చేస్తామన్న బండి సంజయ్‌.. సిట్‌ నోటీసులపై స్పందిస్తూ.. తనకు నోటీసులు అందలేదని చెప్పారు.
చదవండి: టీఎస్‌పీఎస్సీ వద్ద ప్లెక్సీల కలకలం.. ఇచ్చట అన్ని పేపర్లు లభించును..!

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top