జేఎన్టీయూలో ముగిసిన హ్యాకథాన్‌ | - | Sakshi
Sakshi News home page

జేఎన్టీయూలో ముగిసిన హ్యాకథాన్‌

Nov 1 2025 8:18 AM | Updated on Nov 1 2025 8:18 AM

జేఎన్టీయూలో ముగిసిన హ్యాకథాన్‌

జేఎన్టీయూలో ముగిసిన హ్యాకథాన్‌

● విజేతలకు నగదు పురస్కారాలు ● హాజరైన విద్యార్థులకు సర్టిఫికెట్లు

రామగిరి(మంథని): సెంటినరీకాలనీలోని మంథని జేఎన్టీయూలో చేపట్టిన ఎకో హ్యాకథాన్‌ కార్యక్ర మం శుక్రవారం ముగిసింది. నేషనల్‌ గ్రీన్‌క్రాప్‌ హ్యాకథాన్‌ పోటీలకు 22 టీంలతోపాటు మంథని జేఎన్టీయూ, పెద్దపల్లి ట్రినిటి కళాశాల విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో 8 బృందాలు ఫైనల్‌ పో టీలకు ఎంపికయ్యాయి. జడ్జిలుగా శ్రీధర్‌రెడ్డి, సా హు ఛత్రపతి వ్యవహరించారు. ప్రథమ విజేతగా మహవర్ధన్‌, ద్వితీయ విజేతగా రాజ్‌కుమార్‌, తృతీ య విజేతగా ట్రినిటి కళాశాల శివానీ టీమ్‌ ఎంపికయ్యాయి. ప్రథమ బహుమతికి రూ.5వేలు, ద్వితీ య బహుమతికి రూ.3 వేలు, తృతీయ బహుమతికి రూ.వెయ్యి, హ్యాకథాన్‌లో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్లను ప్రిన్సిపాల్‌ విష్ణువర్ధన్‌ అందజేశారు. వైస్‌ ప్రిన్సిపాల్‌ ఉదయ్‌ కుమార్‌, కో ఆర్డినేటర్లు సదానందం, శివకృష్ణ, కావ్య, రాజేశ్‌, మహిపాల్‌, సాయిదీక్షిత్‌, నరహరి, వంశీకృష్ణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement