
అమరుల త్యాగాలు మరువలేనివి
సాక్షి,పెద్దపల్లి: అమరుల ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రం, జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందు కు అందరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర మహి ళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద పిలుపునిచ్చా రు. కలెక్టర్లో సోమవారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో శారద ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తొలుత అమరవీరుల స్తూపం వద్ద నివాళి అర్పించారు. శారద మాట్లాడుతూ, మ హిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి ఇప్పటివరకు రూ.139.40 కోట్లు వెచ్చించామన్నారు. రూ.500 రాయితీ వంటగ్యాస్ సిలిండర్ ద్వారా 1,17,856 కుటుంబాలకు రూ.14.3కోట్లు రాయితీ వర్తింపజేశామని, గృహజ్యోతి కింద రూ.74.23 కోట్లు చెల్లించి 1,31,187 కుటుంబాలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేశామన్నారు. ఇందిరా మహిళా శక్తి ద్వారా మహిళా సంఘాలతో 27 కుట్టుమిషన్ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశామని, వీటిద్వారా విద్యార్థులకు యూనిఫామ్స్ కుట్టిస్తున్నామని తెలిపారు. 4 క్యాంటీన్లు, మొబైల్ ఫిష్ రిటైల్ ఔట్ లె ట్లు ఏర్పాటు చేశామని చెప్పారు. రెండు సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు స్థాపిస్తున్నామని వివరించారు. కొత్తగా 4,467 రేషన్ కార్డులు జారీచేశామని, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకే భూ భారతి చట్టం తీసుకొచ్చామని అన్నారు.
రైతు సంక్షేమానికి ప్రాధాన్యం
రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ, రూ.2లక్షల వరకు రుణమాఫీ చేశామని శారద తెలిపారు. యాసంగిలో రూ.12వేల చొప్పున 1,21,698 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.88.86కోట్లు రైతుభరోసా జమ చేశామని తెలిపారు. అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన 3,556 ఎకరాలకు రూ.10 వేల చొప్పున పరిహారం జమచేస్తామని అన్నారు.
31మందికి గుండె శస్త్రచికిత్సలు
రాజీవ్ ఆరోగ్యశ్రీ సాయాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచి 163 కొత్త వ్యాధులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చామని నేరెళ్ల శారద వివరించారు. దీంతో 24,285 మందికి రూ.57.84కోట్ల విలువైన శస్త్రచికిత్సలను ఉచితంగా నిర్వహించామ ని అన్నారు. జిల్లా ఆస్పత్రిలో ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ క్లిష్టమైన సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని, జిల్లాలో 31 మంది పిల్లలకు గుండె ఆపరేషన్లు ఉచితంగా చేశామన్నారు
నిరుద్యోగుల కోసమే రాజీవ్ యువ వికాసం
నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాజీవ్ యువ వికాసం పథకం ప్రవేశ పెట్టామని నేరెళ్ల శారద అన్నారు. దీని ద్వారా గతేడాది 611 మందికి ఉపాధి కల్పిస్తూ రూ.41.53 కోట్ల పెట్టుబడితో 53 వ్యాపార యూనిట్లకు అనుమతి మంజూరు చేశామన్నారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన ద్వారా రూ.3కోట్ల సబ్సిడీతో 51 యూనిట్లు మంజూరు చేశామని, టీ ప్రైడ్, టీ ఐడియా ద్వారా 84 సేవా, తయారీ రంగ పరిశ్రమలకు రూ.7.68కోట్ల సబ్సిడీ విడుదల చేశామని వివరించారు.
వరి విత్తన వంగడాల పంపిణీ
కూ నారం వ్యవసాయ పరిశోధన కేంద్రం అభివృద్ధి చేసి న కేఎన్ఎం–7715, కేఎన్ఎం–1638, కేఎన్ఎం–12510 సన్నరకాలను 9 మంది రైతులకు ఎమ్మెల్యేలు విజయరమణారావు, మక్కాన్సింగ్, కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్లు అరుణశ్రీ, వేణుతో కలిసి శారద అందజేశారు. డీఏవో ఆదిరెడ్డి, శాస్త్రవే త్త శ్రీధర్ సిద్ధి, మహిళా కమిషన్ సభ్యురాలు కటారి రేవతిరావు, అంతటి అన్నయ్యగౌడ్, ప్రకాశ్రావు, ఈర్ల స్వరూప, డీసీపీ కరుణాకర్ పాల్గొన్నారు.
సీపీ కార్యాలయంలో..
గోదావరిఖని: రామగుండం పోలీస్ కమిషనరేట్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీపీ అంబర్ కిశోర్ ఝా జాతీయ జెండా ఎగురవేశారు. గ్రూప్–1, 3 పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించిన అడ్మిన్ అ డిషనల్ డీసీపీ రాజు, ఏఆర్ ఏసీపీ ప్రతాప్కు ప్రసంశాపత్రాలు అందజేశారు. స్పెషల్ బ్రాంచ్, గోదావరిఖని, ట్రాఫిక్ ఏసీపీలు మల్లారెడ్డి, రమేశ్, శ్రీనివాస్ప్రతాప్, సురేందర్, ఏవో శ్రీనివాస్, సీఐలు, ఆర్ఐలు పాల్గొన్నారు. కాగా, పోలీసు సేవా పతకానికి ఎంపికై న పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ సీపీ అభినందించారు.
అభివృద్ధి దిశగా తెలంగాణ
జ్యోతినగర్(రామగుండం): తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని ఎన్టీపీసీ రామగుండం – తెలంగాణ ప్రాజెక్టు ఈడీ చందన్ కుమార్ సామంత అన్నారు. పీటీఎస్లో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో జెండా ఆవిష్కరించి మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్టీపీసీ రామగుండం ప్రాంతం పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చెందిందని ఆయన అన్నారు. ఎన్టీపీసీ ఎన్బీసీ సభ్యుడు బాబర్ సలీంపాషా, జనరల్ మేనేజర్లు అలోక్ కుమార్ త్రిపాఠి, ముఖుల్ రాయ్, కేసీ సింఘరాయ్, ఏజీఎం బిజయ్కుమార్ సిగ్దర్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్ఎఫ్సీఎల్లో..
ఫెర్టిలైజర్సిటీ(రామగుండం): రామగుండం ఫెర్టిలైజర్స్, కెమికల్స్ లిమిటెడ్ కర్మాగారంలో సీఈవో అలో క్ సింఘాల్ జాతీయ జెండా ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగ అభివృద్ధికి సకాలంలో యూరియా సరఫరా చేయడంలో ఆర్ఎఫ్సీఆర్ అగ్రస్థానంలో ఉందన్నారు. కార్యక్రమంలో ఆర్ఎఫ్సీఆర్ సీజీఎం ఉదయ రాజహంస, అధికారులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో కొత్తగా 4,467 రేషన్ కార్డుల జారీ
రాజీవ్ యువ వికాసంతో నిరుద్యోగులకు ఉపాధి
భూభారతి చట్టంతోనే భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం
రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద
ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

అమరుల త్యాగాలు మరువలేనివి

అమరుల త్యాగాలు మరువలేనివి

అమరుల త్యాగాలు మరువలేనివి

అమరుల త్యాగాలు మరువలేనివి

అమరుల త్యాగాలు మరువలేనివి

అమరుల త్యాగాలు మరువలేనివి

అమరుల త్యాగాలు మరువలేనివి

అమరుల త్యాగాలు మరువలేనివి