
‘రాష్ట్రాన్ని దోచుకున్న బీఆర్ఎస్’
జ్యోతినగర్(రామగుండం): బీ ఆర్ఎస్ పార్టీ తె లంగాణ రాష్ట్రా న్ని దోచుకుందని బీజేపీ జిల్లా అ ధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి విమర్శించారు. జిల్లా కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో సోమవారం తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిర్వహించగా, ఆయన జాతీయ జెండా ఆవిష్కరించి మాట్లాడారు. తెలంగాణ తెచ్చింది తామే అంటూ అధికారాన్ని చేపట్టిన బీఆర్ఎస్.. తన కుటుంబ లాభానికి తెలంగాణని దో చుకుందని ధ్వజమెత్తారు. తెలంగాణ ఇచ్చిన పార్టీ తమదేనంటూ అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని లూటీ చేసిందని మండిపడ్డారు. పల్లె సదానందం, ప ర్ష సమ్మయ్య, జంగ చక్రధర్రెడ్డి, శ్రీనివాస్, తో డి రవీందర్, దూలం సతీశ్ పాల్గొన్నారు.
నేటినుంచి రెవెన్యూ సదస్సులు
పెద్దపల్లిరూరల్: తెలంగాణ ను భూసమస్యలు లేనిరాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు చేపట్టిన భూభారతి చట్టం–2025, భూభారతి నియమావళి– 2025ని అమలు చేసేందుకు ఈనెల 3 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు ఆర్డీవో గంగయ్య తెలిపారు. పెద్దపల్లి డివిజన్లోని అన్ని రెవెన్యూ గ్రామాల్లో ఈ నెల 20 వరకు సదస్సులు నిర్వహిస్తామ న్నా రు. అధికారులు గ్రామాలను సందర్శించి రై తుల నుంచి అర్జీలు స్వీకరిస్తారని పేర్కొన్నారు.
‘పంట మార్పిడి’ పాటించాలి
జూలపల్లి(పెద్దపల్లి): రైతులు పంట మార్పిడి పద్ధతి పాటిస్తే అధిక దిగుబడి వస్తుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు భాస్కర్, వినోద్,కిరణ్ సూ చించారు. శ్రీకొండా లక్ష్మణ్ బాపూజీ వ్యవసా య విద్యాలయం, రామగిరి ఖిల్లా కృషి విజ్ఞాన కేంద్రం, తెలంగాణ వ్యవసాయ విభాగం సంయుక్తంగా వికాసిత్ కృషి సంకల్ప అభియాన్ను కుమ్మరికుంట, వడ్కాపూర్, చీమలపేటలో సో మవారం నిర్వహించాయి. కొత్త వ్యవసాయ వి ధానం, భూసారం పెంపు, డ్రోన్ వినియోగం, ఎరువులు, పురుగుమందు వినియోగం, నారు మడుల్లో యాజమాన్య పద్ధతులు తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. సీనియర్ శాస్త్రవేత్త లక్ష్మణ్, ప్రిన్సిపల్ సైంటిస్ట్ నిరంజన్, ఏవో ప్రత్యూష పాల్గొన్నారు.
వేగంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం
పెద్దపల్లిరూరల్: పైలెట్ గ్రామాల్లో తొలివిడత లో మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల పనులు వే గవంతం చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. కలెక్టరేట్లోని రూమ్ నంబరు 224 లో హౌసింగ్ పీడీ కొత్త కార్యాలయాన్ని సోమ వారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్ల పర్యవేణకు రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ కార్యాలయాన్ని రూమ్ నంబరు 224లో ఏర్పాటు చేశామని తెలిపారు. ఇళ్ల పనుల పురోగతి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. రెండోవిడత మంజూరైన ఇళ్ల ప్రొసీడింగ్స్ను అందుకున్న ల బ్ధిదారులకు పంచాయతీ కార్యదర్శుల సహకారంతో పనులకు మార్కింగ్ చేయాలన్నారు. ప్రభుత్వం నుంచి త్వరగా బిల్లులు అందేలా చూడాలని ఆదేశించారు. రెవెన్యూ ఆర్డీవో గంగయ్య, హౌసింగ్ పీడీ రాజేశ్వర్ పాల్గొన్నారు.
ఎన్డీఆర్ఎఫ్కు రెస్క్యూ శిక్షణ
గోదావరిఖని: ఎన్టీఆర్ఎఫ్ ఐదోబ్యాచ్ సిబ్బందికి రెస్క్యూ శిక్షణను ఆర్జీ–2 జీఎం వెంకట య్య సోమవారం ప్రారంభించారు. కొత్తగూడేనికి చెందిన ఆరో బెటాలియన్ ఎన్డీఆర్ఎఫ్ బృందం తర్ఫీదు పొందుతోంది. జీఎం మాట్లాడుతూ సింగరేణి రెస్క్యూ అందిస్తున్న శిక్షణ ఎంతో తోడ్పడుతుందన్నారు. రెస్క్యూ జీఎం శ్రీనివాస్రెడ్డి, సూపరింటెండెంట్ మాధవరా వు, రాజేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఓదెల మల్లికార్జునస్వామి ఆదాయం రూ.5లక్షలు
ఓదెల(పెద్దపల్లి): ఓదెల మల్లికార్జునస్వామి జాతర ఆదాయం రూ.5లక్షల12వేల 20 సమ కూరినట్లు ఈవో సదయ్య సోమవారం తెలిపారు. భక్తులు ఒకరోజు మల్లికార్జునస్వామిని దర్శించుకోవడం ద్వారా, స్వామివారికి పట్నా లు, బోనాలు వేయడం ద్వారా, ప్రత్యేక దర్శనం, అర్చనలు ద్వారా ఈ ఆదాయం సమకూరినట్లు ఆయన వివరించారు.

‘రాష్ట్రాన్ని దోచుకున్న బీఆర్ఎస్’

‘రాష్ట్రాన్ని దోచుకున్న బీఆర్ఎస్’

‘రాష్ట్రాన్ని దోచుకున్న బీఆర్ఎస్’