
నేటి నుంచి వైద్యశిబిరాలు
సుల్తానాబాద్(పెద్దపల్లి): వందరోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఈనెల 3 నుంచి నిర్వహించే వైద్యశిబిరాలను విజయవంతంచేయాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి అన్న ప్రసన్నకుమారి కోరారు. కలెక్టరేట్లోని తన కార్యాలయంలో మేల్ హెల్త్ అసిస్టెంట్లు, ఐసీటీసీ కేంద్రాల్లోని సిబ్బందితో ఆమె సోమవారం సమావేశమయ్యారు. శిబిరాల్లో వైద్యాధికారి, ల్యాబ్ టెక్నీషియన్, కౌన్సెలర్లు సేవలు అందిస్తారని తెలిపారు. డయాబెటిస్, బీపీ, హిమోగ్లోబిన్, క్షయ, మహిళా వ్యాధుల నిర్ధారణకు శాంపిళ్లు సేకరిస్తారని ఆమె అన్నారు. కార్యక్రమంలో డాక్టర్లు కేవీ సుధాకర్రెడ్డి, రాజమౌళి, శ్రీరాములు, వాణిశ్రీ, కిరణ్కుమార్ పాల్గొన్నారు.
ఐటీఐలలో ప్రవేశాలు
సుల్తానాబాద్(పెద్దపల్లి): జిల్లాలోని వివిధ ఐటీఐలలో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఇన్చార్జి ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. ఈనెల 21 తేదీ వరకు గడువు ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్, మైనారిటీ ఐటీఐలలో ప్రవేశాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లను స్కాన్ చేసి ఆన్లైన్లో నమోదు చేయాలని, ఒకరు ఒకే దరఖాస్తు చేయాలన్నారు. దరఖాస్తుల నమోదుకు వెబ్సైట్ https://iti. telangana.gov.inలో లాగిన్ చేయాలని ఆయన సూచించారు. ప్రవేశ రుసుం రూ.100 చెల్లిస్తూ, ఆధార్, మొబైల్ నంబర్, మెయిల్ ఐడీ తప్పనిసరిగా నమోదు చేయాలని ఆయన సూచించారు.