
అమరవీరుల స్తూపంపై నిర్లక్ష్యం!
కోల్సిటీ(రామగుండం): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా సోమవారం అమరవీరుల స్తూపంపై రామగుండం బల్దియా అధికారులు వ్యవహరించిన తీరుపై స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గోదావరిఖని గాంధీచౌక్ ప్రధాన చౌరస్తాలోని అమరవీరుల స్తూపానికి పూలతో అలంకరణ చేయకపోవడంపై వారు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కంగుతిన్న బల్దియా అధికారులు వెంటనే అమరవీరుల స్తూపానికి పూలమాలలతోపాటు విద్యుత్ దీపాలతో అలంకరించారు.
ఆగ్రహం వ్యక్తం చేసిన స్వచ్ఛంద సంఘాలు
సాయంత్రానికి పూలతో అలంకరించిన అధికారులు

అమరవీరుల స్తూపంపై నిర్లక్ష్యం!