
జిన్నింగ్ మిల్లుల్లో పత్తి కొనుగోళ్లు
పెద్దపల్లిరూరల్: రైతుల నుంచి జిన్నింగుమిల్లుల్లో పత్తి కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్యార్డుకు ఆశించిన మేర పత్తి నిల్వలు రాకపోవడంతో కొనుగోలు చేసేందుకు వ్యాపారు లు రావడంలేదు. మిగిలి ఉన్న పత్తి నిల్వలను అమ్ముకునేందుకు వచ్చే రైతుల నుంచి జిన్నింగుమిల్లుల్లో కొనుగోలు చేస్తున్నారు. మంగళవారం రూ.7,400 క్వింటాళ్లు కొనుగోలు చేసినట్లు రాఘవాపూర్ జిన్నింగుమిల్లు నిర్వాహకులు తెలిపారు. జిల్లాకు చెందిన వారే కాకుండా పొరుగున ఉన్న ఆసిఫాబాద్, వేములవాడ, జమ్మికుంట తదితర ప్రాంతాలకు చెందిన రైతులు సైతం వ్యాన్లలో పత్తిని తీసుకొచ్చి పెద్దపల్లిలోని జిన్నింగ్ మిల్లుల్లో విక్రయిస్తున్నారు.