
ఘనంగా తిరంగా యాత్ర
గోదావరిఖనిటౌన్: విశ్వహిందూ పరిషత్ మాతృశక్తి దుర్గావాహిణి ఆధ్వర్యంలో ఆపరేషన్ సిందూర్ వి జయవంతంపై నగరంలో మంగళవారం తిరంగా యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ మ హిళా విభాగం బాధ్యులు సూర్యదేవ జ్యోతి, కోట తిరుమల, ఆరెల్లి మమత మాట్లాడారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల దాడిలో పహగాల్గాంలో అమయక పర్యాటకులు మృతి చెందారని అన్నారు. ఉగ్రవాదులను గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ నగర కార్యదర్శి మ్యాడగోని రవీందర్, నాయకులు దీప్తి, ఇందిర, ప్రమీళ, మల్లేశ్వరి, వర్షిత, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.