రిమాండ్‌ ఖైదీ పరార్‌ | - | Sakshi
Sakshi News home page

రిమాండ్‌ ఖైదీ పరార్‌

May 28 2025 5:49 PM | Updated on May 28 2025 5:49 PM

 రిమాండ్‌ ఖైదీ పరార్‌

రిమాండ్‌ ఖైదీ పరార్‌

● గాలిస్తున్న పోలీసులు

జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లా కేంద్రంలోని కోర్టు నుంచి జైలుకు తరలిస్తున్న క్రమంలో రిమాండ్‌ ఖైదీ పోలీసుల కన్నుగప్పి పరారైన సంఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లింగాపూర్‌కు చెందిన జున్ను ప్రసాద్‌ నిరుద్యోగులను గల్ఫ్‌ పంపిస్తానని, డబ్బులు తీసుకుని మోసానికి పాల్పడ్డాడు. దీంతో బాధితులు పెగడపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఈనెల 17న కేసు నమోదు చేసి జున్ను ప్రసాద్‌ను జగిత్యాల జైలుకు తరలించారు. అతడిపై కొడిమ్యాల పోలీస్‌స్టేషన్‌లో కూడా గల్ఫ్‌ మోసంపై కేసు నమోదైంది. దీంతో కొడిమ్యాల పోలీసులు పీటీ వారెంట్‌ ద్వారా ప్రసాద్‌ను జైలు నుంచి తీసుకొచ్చి.. జగిత్యాల కోర్టులో మంగళవారం సాయంత్రం న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. తిరిగి రిమాండ్‌కు తరలిస్తున్న క్రమంలో పోలీసుల కన్నుగప్పి పరారయ్యాడు. అతడి కోసం పోలీసులు ప్రత్యేక బృందాల ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు.

గంజాయి తరలిస్తున్న ఇద్దరి పట్టివేత

మెట్‌పల్లి: గంజాయి తరలిస్తున్న ఇద్దరిని పట్టుకున్నట్లు ఎస్సై కిరణ్‌కుమార్‌ తెలిపారు. పట్టణ శివారులో మంగళవారం పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా..అబ్దుల్‌ సోహైల్‌, ఓ మైనర్‌ బాలుడు ద్విచక్ర వాహనంపై అక్కడకు వచ్చారు. అనుమానాస్పదంగా కనిపించిన వారిని తనిఖీ చేయగా.. వారి వద్ద 120 గ్రాముల గంజాయి దొరికింది. వారిపై కేసు నమోదు చేసి బైక్‌, రెండు సెల్‌ఫోన్‌లు సీజ్‌ చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement