ముగిసిన డీఈఈసెట్‌ | - | Sakshi
Sakshi News home page

ముగిసిన డీఈఈసెట్‌

May 26 2025 9:52 AM | Updated on May 26 2025 9:52 AM

ముగిస

ముగిసిన డీఈఈసెట్‌

రామగిరి(మంథని): సెంటినరీకాలనీలోని మంథని జేఎన్టీయూలో ఆదివారం చేపట్టిన డీఈఈసెట్‌ ఆన్‌లైన్‌ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉదయం సెషన్‌లో జరిగిన పరీక్షకు 137 మంది అభ్యర్థులకు 100 మంది, మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 144 మందికి 103 మంది హాజరయ్యారని ప్రిన్సిపాల్‌ బి.విష్ణువర్ధన్‌ తెలిపారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్సై చంద్రకుమార్‌ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు చేపట్టారు.

శాంతిచర్చలు జరపాలి

జ్యోతినగర్‌(రామగుండం): మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్‌పై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని సీపీఐ(ఎంఎల్‌)మాస్‌లైన్‌ ప్రజా పంథా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. ఎన్టీపీసీలోని రాజీవ్‌ రహదారిపై ఆదివారం నల్లజెండాలతో నిరసన చేపట్టారు. శ్రీనివాస్‌ మాట్లాడుతూ, కేశవరావు సహా 27 మంది మావో యిస్టులను ఎన్‌కౌంటర్‌లో హతమార్చడం దుర్మార్గమన్నారు. మావోయిస్టులతో కేంద్రప్రభుత్వం శాంతిచర్చలు జరపాలని ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేస్తున్నా కేంద్రప్రభుత్వం పెడచెవిన పెట్టడం శోచనీయమన్నారు. ఆపరేషన్‌ కగార్‌ను వెంటనే నిలిపివేయాలని ఆయన కోరారు. నాయకులు తోకల రమేశ్‌, గొల్లపల్లి చంద్రయ్య, గూడూరు వైకుంఠం, మార్త రాములు, రాయమల్లు, సురేశ్‌, సునీత, మల్లేశ్‌, రవి, రాములు పాల్గొన్నారు.

సిట్టింగ్‌ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలి

గోదావరిఖని: మావోయిస్టు పార్టీ కేంద్ర క మిటీ కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్‌పై సిట్టింగ్‌ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని సీపీఐ(ఎంఎల్‌) న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎం.శ్రీనివాస్‌ డిమాండ్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌ లో నిర్వహించిన జిల్లాస్థాయి సదస్సులో ఆ యన మాట్లాడారు. పహల్గామ్‌ హత్యలపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని, ఆపరేషన్‌ సిందూర్‌లో దాగిఉన్న అంశాల్లో అన్నికోణాలను బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. పహల్గాంలో దాడి చేసిన వారిని ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం గుర్తించి పట్టుకోలేదని, ఆపరేషన్‌ సిందూర్‌లో యుద్ధం అర్ధ్ధంతరంగా ముగిసిందని అమెరికా అధ్యక్షుడు ట్రంపు ప్రకటించడంలో ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. నాయకులు ఐ.కృష్ణ, నరేశ్‌, వెంకన్న, చిలుక శంకర్‌, రామకృష్ణ, రాజేశం, మేరుగు చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా అరుణోదయ కళాకారుల పాటలు ఉత్తేజపర్చాయి.

ప్రశాంతంగా గ్రామపాలన అధికారుల పరీక్ష

పెద్దపల్లిరూరల్‌: స్థానిక ప్రభుత్వడిగ్రీ కాలేజీలో ఆదివారం గ్రామపాలన అధికారుల పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఈ పరీక్షకు 90మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా 82మంది హాజరయ్యారని పరీక్షల సూపరింటెండెంట్‌, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్‌ లక్ష్మీనర్సయ్య తెలిపారు. పరీక్ష కేంద్రాన్ని అడిషనల్‌ కలెక్టర్‌ వేణు ఆకస్మికంగా తనిఖీ చేశారు.

నేడు మంత్రి పర్యటన

మంథని: నియోజకవర్గంలో మంత్రి శ్రీధర్‌బాబు సోమవారం పలు అభివృద్ధి పనులను ప్రా రంభించనున్నారు. గుంజపడుగులో రూ.2.90 కోట్లతో ఏర్పాటు చేసే సోలార్‌ ప్రాజెక్ట్‌ అనుమ తి పత్రాలను మంత్రి అందజేస్తారు. మంథని బస్‌ డిపో సమీపంలో డ్రీమ్‌, స్టార్ట్‌ – రైజ్‌ ఇన్నో వేషన్‌ నెట్‌వర్క్‌లో భాగంగా గ్రామీణ ప్రొటోటైపింగ్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌ను ప్రారంభిస్తారు. మల్హర్‌ మండలం కొయ్యూరు సరస్వతీ పుష్కరాలకు వెళ్లేవారికి అన్నదానం ప్రారంభిస్తారు.

ముగిసిన డీఈఈసెట్‌ 1
1/3

ముగిసిన డీఈఈసెట్‌

ముగిసిన డీఈఈసెట్‌ 2
2/3

ముగిసిన డీఈఈసెట్‌

ముగిసిన డీఈఈసెట్‌ 3
3/3

ముగిసిన డీఈఈసెట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement