
అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే ఠాకూర్ సమీక్ష
గోదావరిఖని : రామ గుండం నియోజకవర్గంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులపై ఎమ్మె ల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ ఆదివారం సింగరేణి అధికారులతో స మీక్షించారు. ప్రధాన చౌ రస్తాలో షాపింగ్ కాంప్లెక్స్, ఇంటర్నల్ రోడ్లు, తాగునీటి కోసం ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్, జనగామ, బస్టాండ్ తదితర ప్రాంతాల్లో చేపట్టిన రోడ్ల నిర్మాణాలు, విద్యుత్ దీపాల ఏర్పాటు తదితర అంశాలపై చర్చించారు. మురుగునీటిని శుభ్రం చేసే ఎిస్టీపీపీల నిర్మాణం పురోగతిపై ఆరా తీశారు. ఖబ్రస్తాన్ పనుల గురించి చర్చించారు. కార్యక్రమంలో ఆర్జీ–1 జీఎం లలిత్కుమార్, సివిల్ డీజీఎం వరప్రసాద్, సెక్యూరిటీ అధికారి వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వర్ధంతి సభకు హాజరు
గోదావరిఖనిటౌన్: టీపీసీసీ కార్యదర్శి పెద్దెల్లి ప్రకాశ్ తల్లి మధునమ్మ వర్ధంతి సభ ఆదివారం నగరంలో జరిగింది. రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ ఈ సభకు హాజరయ్యారు. మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మాజీ ఎమ్మెల్సీ సంతోష్కుమార్, ఆర్జీ–1 జీఎం లలిత్కుమార్, ప్రతినిధులు బొంతల రాజేశ్, మహంకాళి స్వామి, దీటి బాలరాజు, ముస్తఫా, గట్ల రమేశ్, తిప్పారపు శ్రీనివాస్, అమరేందర్, సతీశ్, వరలక్ష్మి, పద్మజ, చంద్రశేఖర్, గొర్రె రమేశ్, మోహన్రావు, అనిల్కుమార్ తదితరులు పాల్గొన్నారు.