
జాప్యం చేయడంతోనే ఇబ్బంది
ధాన్యం కొనుగోళ్లలో తీవ్రజాప్యం జరుగుతోంది. 15 రోజులక్రితం కేంద్రంలో ధాన్యంపోశా. శుక్రవారం తూకం వేశారు. ఇంకా కొన్ని బస్తాల ధాన్యం తూకం వేయాల్సి ఉంది. అకాల వర్షంతో ఇబ్బందులు పడాల్సివస్తోంది.
– వేముల రమేశ్, పెద్దబొంకూర్
20 రోజులుగా నిరీక్షణే..
ధాన్యాన్ని మద్దతు ధరకు అమ్ముకుందామనే ఆశతో వస్తే తూకం వేయడంలో జాప్యం చేశారు. తేమశాతం నిబంధనలకు లోబడే వచ్చినా.. బార్దాన్ ఇవ్వకండా ఇబ్బంది పెట్టారు. ఇపుడు ఇలా కురిసిన వానకు ధాన్యం తడిసింది.
– సంటి నంబయ్య, బొంపల్లి
కవర్లు ఇవ్వలేదు..
ధాన్యం మార్కెట్కు తెచ్చి నాలుగు రోజులకంటే ఎక్కువే అయ్యింది. ఎక్కడపడితే అక్కడే ఆరబోసుకుంటున్న టార్పాలిన్ కవర్లు ఇవ్వాలని అడిగితే ఇస్తలేరు. అకాల వర్షంతో ధాన్యం తడిసింది. ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలి.
– శంకర్, శాస్త్రినగర్
20 ట్రాక్టర్ల ధాన్యం తడిసింది
ధాన్యం అమ్మేందుకు కదంబాపూర్ గ్రామం నుంచి సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు తీసుకొచ్చిన. యార్డులో ఆరబోసినా. కాంటా పెట్టడంలో ఆలస్యం చేసిన్రు. ఇప్పుడు వడ్లన్నీ తడిసినయ్. ప్రభుత్వం ఆదుకోవాలి.
– గోస్కుల కవిత కదంబాపూర్

జాప్యం చేయడంతోనే ఇబ్బంది

జాప్యం చేయడంతోనే ఇబ్బంది

జాప్యం చేయడంతోనే ఇబ్బంది