శ్రమించారు.. విజయం సాధించారు | - | Sakshi
Sakshi News home page

శ్రమించారు.. విజయం సాధించారు

May 1 2025 2:09 AM | Updated on May 1 2025 2:09 AM

శ్రమించారు.. విజయం సాధించారు

శ్రమించారు.. విజయం సాధించారు

● టెన్త్‌ ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల హవా ● 550కి పైగా మార్కులు సాధించిన పేదింటి పిల్లలు

పెద్దపల్లిరూరల్‌: జిల్లాలోని ప్రభుత్వ పాఠ శాలల విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి సత్తా చూపారు. ఆయా మండలాల్లో టాపర్‌గా నిలిచి ఔరా అనిపించారు. మొత్తం 600 మార్కులకు 550 కిపైగా మార్కులు సాధించిన విద్యార్థుల ను ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయు లు, తల్లిదండ్రులు అభినందించారు. ప్ర త్యేక తరగతుల నిర్వహణ, సందేహాల ని వృత్తిలో ఉపాధ్యాయులు ఇచ్చిన ప్రోత్సాహం, నిరంతరం చదవడం ద్వారా తామీ ఫలితాలు సాధించినట్లు విద్యార్థులు తెలిపారు. వీరంతా పేద కుటుంబాలకు చెందిన వారే కావడం గమనార్హం. జూలపల్లి మండలంలోని ప్రభుత్వ పాఠశాలకు చెందిన పాటకుల ఆశ్విత 568 మార్కులు సాధించింది. అదేవిధంగా రామగుండం మండలం లింగాపూర్‌ మోడల్‌ స్కూల్‌కు చెందిన పిట్టల శ్రీవల్లి 569, రామగిరి మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయానికి చెందిన సిరిపురం శ్రీజ, ఎస్‌.వర్షిత 580, కమాన్‌పూర్‌ మండలం జూలపల్లి ప్రభుత్వ పాఠశాలకు చెందిన వైద్య శ్రీవరుణ్‌ 572, ఓదెల మోడల్‌ స్కూల్‌కు చెందిన బి.తన్మయి 561, కాల్వశ్రీరాంపూర్‌ మండలం మల్యాల మోడల్‌ స్కూల్‌కు చెందిన సహస్ర వర్షిణి 564 మార్కులు సాధించారు.

మేనేజ్‌మెంట్‌ వారీగా ఫలితాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement