
జిల్లా జడ్జిని కలిసిన కలెక్టర్
పెద్దపల్లిరూరల్: జిల్లా ప్రధాన న్యాయ మూర్తిగా బాధ్యతలు స్వీకరించిన సునీతా కుంచాలను కలెక్టర్ కోయ శ్రీహర్ష మంగళవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. జిల్లా న్యాయస్థానంలో జిల్లా జడ్జిని కలిసి మొక్క అందించి శుభాకాంక్షలు తెలిపారు
కాంట్రాక్టు కార్మికుల నిరసన
ఫెర్టిలైజర్సిటీ(రామగుండం): రామగుండం ఫెర్టిలైజర్స్, కెమికల్స్ లిమిటెడ్ కర్మాగారంలో కాంట్రాక్టు కార్మికులు మంగళవారం విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. తమ వేత నాలు, బోనస్, అలోవెన్స్ సమస్యలు పరిష్క రించాలని డిమాండ్ చేశారు. ఆర్ఎఫ్సీఎల్ మ జ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో సుమారు 400 మంది విధులు బహిష్కరించారు. యూనియ న్ నాయకుడు అంబటి నరేశ్ మాట్లాడుతూ, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కేంద్ర లేబర్ కమిషనర్ను ఆశ్రయించినా.. ఆర్ఎఫ్సీఎల్ యాజమాన్యం కాలయాపన చేస్తోందన్నా రు. అనంతరం సీజీఎం ఉదయ్ రాజహంసతో నాయకులు చర్చలు జరపగా.. మే 3వ తేదీలో గా డిమాండ్లు పరిష్కరిస్తామని హామీ ఇచ్చార ని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొమురన్న, రాంకీగౌడ్, అఫ్జల్, దేవయ్య, నయీమ్, నరేశ్, రవి, శ్రీనివాస్, రమేశ్, ప్రకాశ్, మహేందర్, సతీశ్ పాల్గొన్నారు.
కరాటే విద్యార్థులకు గ్రేడింగ్ టెస్ట్
మంథని: స్థానిక శ్రీలక్ష్మీభారతి ఫంక్షన్హాల్లో మంగళవారం షోటోకాన్ కరాటే ఇన్స్ట్రక్టర్ కోండ్ర నాగరాజు ఆధ్వర్యంలో విద్యార్థులకు గ్రేడింగ్ టెస్ట్ నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన వారికి జూనియర్ రెడ్, ఎల్లో, ఆరెంజ్, గ్రీన్, బ్లూ, పర్పుల్, బ్రౌన్ బెల్ట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమలో షోటోకాన్ కరాటే అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నూకల బానయ్య, రాపోలు సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
ప్రశాంతంగా ఎప్సెట్
రామగిరి(మంథని): సెంటినరీకాలనీలోని మంథని జేఎన్టీయూలో మంగళవారం ఎప్సెట్ ప్రారంభమైంది. తొలిరోజు అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు నిర్వహించారు. ఆన్లైన్ పద్ధతిన ఉదయం, మధ్యాహ్నం పరీక్షలు జరిగాయి. ఉదయం పరీక్షకు 100 మందికి గాను 95 మంది, మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 92 మంది హాజరైనట్లు ప్రిన్సిపాల్ విష్ణువర్ధన్ తెలిపారు. ఎస్సై చంద్రకుమార్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
గోదావరిఖని: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరవుతాయని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ అన్నారు. స్థానిక ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయం నుంచి అంతర్గాం, పాలకుర్తి మండలాల కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులతో మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. లబ్ధిదారుల ఎంపిక విషయంలో అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని అన్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల పురోగతి, ప్రజా సమస్యలు తదితర విషయాలపై మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లతో ఆయన చర్చించారు. ఈకార్యక్రమంలో అన్ని గ్రామాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

జిల్లా జడ్జిని కలిసిన కలెక్టర్

జిల్లా జడ్జిని కలిసిన కలెక్టర్

జిల్లా జడ్జిని కలిసిన కలెక్టర్

జిల్లా జడ్జిని కలిసిన కలెక్టర్