
మే ఒకటి నుంచి శిక్షణ శిబిరాలు
జ్యోతినగర్(రామగుండం): జిల్లా పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో మే ఒకటి నుంచి జూన్ 10 వరకు వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాధికారి మాధవి తెలిపారు. సోమవారం ఎన్టీపీసీ జిల్లా పరిషత్ హైస్కూల్లో ఎంఈవో చంద్రయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడారు. రామగుండం కార్పొరేషన్, పాలకుర్తి, అంతర్గాం మండలాల పరిధిలోని ప్రభుత్వ హైస్కూల్స్లో శిక్షణ నిమిత్తం 90 మంది వలంటీర్లను ఎంపిక చేసి జిల్లా రిసోర్స్పర్సన్స్ రవి, సంపత్రెడ్డి ఒక రోజు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. రోజూ ఉదయం 8 నుంచి 10.30 గంటల వరకు వలంటీర్లు ఆటలు, డ్రాయింగ్, తెలుగు, ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్ బోధిస్తారని పేర్కొన్నారు. రెండు మండలాల విద్యాధికారులు ఏకాంబరం, విమల, కాంప్లెక్స్ ఉపాధ్యాయులు సంగీత, కమలాకర్రావు, గాయత్రిదేవి, గోపి, భూమయ్య, క్లస్టర్ రిసోర్స్పర్సన్స్ రామ్కుమార్, వెంకట్, శ్రీనివాస్, సతీశ్, శ్రీలత, గౌస్, జ్యోతి, వాణిశ్రీ తదితరులున్నారు.