కేసీఆర్‌ స్ఫూర్తితో పార్టీ శ్రేణులు పని చేయాలి | - | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ స్ఫూర్తితో పార్టీ శ్రేణులు పని చేయాలి

Apr 28 2025 12:06 AM | Updated on Apr 28 2025 12:06 AM

కేసీఆ

కేసీఆర్‌ స్ఫూర్తితో పార్టీ శ్రేణులు పని చేయాలి

మంథని/పెద్దపల్లిరూరల్‌: మాజీ సీఎం కేసీఆర్‌ స్ఫూర్తితో మంథని నియోజకవర్గంలో వెలుగులు నింపేందుకు పార్టీ శ్రేణులు పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు పిలుపునిచ్చారు. వరంగల్‌ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభకు తరలివెళ్తున్న సందర్భంగా మంథని ప్రభుత్వ కళాశాల ఎదురుగా బీఆర్‌ఎస్‌ జెండా ఆవిష్కరించారు. అనంతరం జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు. నియోజకవర్గంలో ఒకే కుటుంబానికి 40 ఏళ్లు అవకాశం ఇస్తే ఆ కుటుంబం బాగుపడుతుందే తప్ప ప్రజలకు ఎలాంటి మేలు జరుగుతలేదని, కనీస వసతులు లేని నియోజకవర్గంగా మారిందన్నారు. పదేండ్ల కాలంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి చూపించిందని, కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16నెలలు గడుస్తున్నా 16 పైసల పని చేయలేదన్నారు.

సభకు తరలిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు

బీఆర్‌ఎస్‌ రజతోత్సవ వేడుకల సందర్భంగా పెద్దపల్లిలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పార్టీ ప తాకాన్ని ఆవిష్కరించారు. నియోజకవర్గం లోని అ న్ని మండలాలు, గ్రామాల నుంచి బస్సులు, ఇతర వాహనాల్లో ఎల్కతుర్తికి తరలివెళ్లారు. మనోహర్‌రెడ్డి వాహనాలకు జెండా ఊపి ప్రారంభించారు. సభకు తరలివెళుతున్న పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.

కేసీఆర్‌ స్ఫూర్తితో పార్టీ శ్రేణులు పని చేయాలి1
1/1

కేసీఆర్‌ స్ఫూర్తితో పార్టీ శ్రేణులు పని చేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement