తాగునీటి ఎద్దడి నివారణ చర్యలు తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

తాగునీటి ఎద్దడి నివారణ చర్యలు తప్పనిసరి

Apr 25 2025 1:14 AM | Updated on Apr 25 2025 1:14 AM

తాగునీటి ఎద్దడి నివారణ చర్యలు తప్పనిసరి

తాగునీటి ఎద్దడి నివారణ చర్యలు తప్పనిసరి

కాల్వశ్రీరాంపూర్‌: గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నివారణ చర్యలు చేపట్టాలని డీపీవో వీరబుచ్చ య్య పంచాయితీ కార్యదర్శులను ఆదేశించారు. గురువారం మండల పరిషత్‌ కార్యాలయంలో తాగునీటి సమస్యలు, పారిశుధ్య పనులపై సమీ క్ష సమావేశం నిర్వహించారు. తాగునీటి బావుల్లో పూడికతీత, ఆర్‌డబ్ల్యూఎస్‌ పథకాలు, వాగు, మానేరు నదిలో బోరుబావుల నుంచి పైపులైన్లను పరిశీలించారు. తాగునీటి సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎంపీడీవో పూర్ణచందర్‌రావు, ఎంపీవో మహ్మద్‌ ఆరీఫ్‌, సూపరింటెండెంట్‌ శ్రీధర్‌, పంచాయితీ కార్యదర్శులు పాల్గొన్నారు.

ఘనంగా పంచాయతీరాజ్‌ దినోత్సవం

కాల్వశ్రీరాంపూర్‌: జాతీయ పంచాయితీ రాజ్‌ దినోత్సవ వేడుకలను గురువారం మండల పరిషత్‌ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. డీపీవో వీరబుచ్చయ్య హాజరై కేక్‌ కట్‌ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. జాతీయ పంచాయితీ రాజ్‌ ఆవశ్యకత, ప్రాముఖ్యతను వివరించారు. జాతీయ పంచాయతీ రాజ్‌ ఆవిర్భావంతో పాలన వికేంద్రీకరణ జరిగి అభివృద్ధి వేగవంతమైందన్నారు. ఎంపీడీవో పూర్ణచందర్‌రావు, ఎంపీవో మహ్మద్‌ ఆరీఫ్‌, సూపరింటెండెంట్‌ శ్రీధర్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ రవీందర్‌, పంచాయతీ కార్యదర్శులు, కంప్యూటర్‌ ఆపరేటర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement