
గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
● రామగుండం ఎమ్మెల్యే రాజ్ఠాకూర్
గోదావరిఖని: గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా సింగరేణి యాజమాన్యం ముందుకు సాగుతోందని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ అన్నా రు. జనగామ గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఆర్జీ–1 జీఎం లలిత్కుమార్తో కలిసి సోమవారం ఆయన ప్రారంభించారు. నిర్మాణంలో ఉన్న ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ పనులను ఆయన పరిశీలించారు. ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించి మాట్లాడారు. సంక్షేమ పథకాలతోనే రైతులకు గౌరవం పెరుగుతుందని అన్నారు. రూ.25కోట్లతో సింగరేణి నిర్మించిన ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ ద్వారా త్వరలో కార్మిక వాడలకు మిషన్భగీరధ తరహాలో స్వచ్చమైన నీరు అందుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు కిరణ్బాబు, వెంకటేశ్వర్రావు, కర్ణ, వరప్రసాద్, వసంత్కుమార్, కాంగ్రెస్ నేతలు స్వామి, ముస్తఫా పాల్గొన్నారు.