
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పది వేల మంది
పెద్దపల్లిరూరల్: ఎల్కతుర్తిలో ఈనెల 27న నిర్వహించే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు పెద్దపల్లి నియోజకవర్గం నుంచి 10వేల మందిని తరలించేలా కార్యాచరణ సిద్ధం చేశామని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో సభ ప్రచార పోస్టర్ను సోమవారం ఆయన ఆవిష్కరించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ ఆవిర్భవించి పాతికేళ్లు అయిన సందర్భంగా నిర్వహించే సభను విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు, క్రియాశీల కార్యకర్తలు సన్నద్ధంగా ఉండాలన్నారు. సభ పూర్తయ్యాక బీఆర్ఎస్ పాలనలో అమలు చేసిన పథకాలు, ప్రస్తుతం అందుతున్న పథకాలు, పాలనతీరుపై ఊరూరా రచ్చబండ చర్చలు జరపాలని సూచించారు. ఎండల తీవ్రతతో వాహనాల్లో ప్రయాణించే వారికి మంచినీళ్లు, మజ్జిగ పాకెట్లు, భోజనం అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. నాయకులు మర్కు లక్ష్మణ్, ఉప్పు రాజ్కుమార్, వెంకట్రెడ్డి, బాలాజీరావు, శ్రీనివాస్, మోహన్రావు, మోబిన్, దేవయ్య, చంద్రశేఖర్, సతీశ్, శ్రీధర్, ప్రేమ్, శ్రీకాంత్, నటరాజ్, అతీఖ్, ఆదిల్ తదితరులు పాల్గొన్నారు.
పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే మనోహర్రెడ్డి