
కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి
జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్ నిర్మాణంలో భూములు కోల్పోయిన కుటుంబాల్లో ఒక్కొక్కరికి ఉద్యోగావకాశం కల్పించాలని ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ మక్కాన్సింగ్ సూచించారు. ఎన్టీపీసీ మిలీనియం హాల్లో ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్ ప్రభావిత గ్రామాల డివిజన్ల అభివృద్ధి సంక్షేమంపై అధికారులతో సమీక్షించారు. ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మికులకు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించాలని, సీటీ స్కాన్, ఎంఆర్ఐ స్కానింగ్ అందుబాటులోకి తేవాలన్నారు. కాలుష్య నియంత్రణకు మొక్కలు నాటాలని, కుందనపల్లి గ్రామాన్ని కాలుష్యం నుంచి కాపాడాలని కోరారు. రోడ్లు, సర్వీస్ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించి, సోలార్ లైట్లు ఏర్పాటు చేయాలన్నారు. వీర్లపల్లి గ్రామాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించాలని, నిర్వాసితులకు ఇళ్ల స్థలాలు ఇప్పించి, ఇళ్లు నిర్మించే బాధ్యతను ఆర్ఎఫ్సీఎల్ తీసుకోవాలని సూచించారు. ఎన్టీపీసీ ఏజీఎం బిజయ్కుమార్ సిగ్దర్, ఆర్ఎఫ్సీఎల్ హెచ్ఆర్ సోమనాథ్, తహసీల్దార్ ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. కాగా, తన భర్త చనిపోయాగా కాంట్రాక్టు కార్మికురాలిగా విధుల్లోకి తీసుకున్న ఎన్టీపీసీ.. నెలలో 15రోజులే పని కల్పిస్తోందని నర్రశాలపల్లికి చెందిన నిర్వాసితురాలు ఈదునూరి కనకతార ఎమ్మెల్యే మక్కాన్సింగ్కు విన్నవించారు. తనకు పూర్తిస్థాయిలో పనిదినాలు కల్పించాలని కోరారు.
రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్