రామగుండం.. ఇక మహానగరం | - | Sakshi
Sakshi News home page

రామగుండం.. ఇక మహానగరం

Apr 21 2025 12:51 AM | Updated on Apr 21 2025 12:51 AM

రామగుండం.. ఇక మహానగరం

రామగుండం.. ఇక మహానగరం

గోదావరిఖని: రామగుండం పారిశ్రామిక ప్రాంతాన్ని మహానగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజ్‌ఠాకూర్‌ అన్నారు. స్థానిక తిలక్‌నగర్‌ డౌన్‌లోని స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ వద్ద సింగరేణి నిర్మించిన ప్రజాపార్క్‌ను ఆర్జీ–1 జీఎం లలిత్‌కుమార్‌తో కలిసి ఆదివారం ఆయన ప్రారంభించారు. తిలక్‌నగర్‌వాసుల కోసం రూ.25 లక్షల వ్యయంతో పార్క్‌ నిర్మించిందని ఎమ్మెల్యే అన్నారు. సింగరేణి, రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో నగరంలో పలు అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. సింగరేణి అధికారులు గోపాల్‌సింగ్‌, కిరణ్‌బాబు, వీరారెడ్డి, కర్ణ, జితేందర్‌సింగ్‌, వరప్రసాద్‌, హనుమంతరావు, కాంగ్రెస్‌ నాయకులు మహంకాళి స్వామి, బొంతల రాజేశ్‌, పెద్ద్దెల్లి ప్రకాశ్‌, ముస్తఫా తదితరులు పా ల్గొన్నారు. అనంతరం సింగరేణి ఏరియా ఆ స్ప త్రిలో నిర్మిస్తున్న క్యాథ్‌ల్యాబ్‌ను జీఎంతో కలి సి ఎమ్మెల్యే పరిశీలించారు. గుండె సంబంధిత వ్యా ధుల నిర్ధారణ, చికిత్స కోసం సింగరేణి క్యా థ్‌ ల్యాబ్‌ ఏర్పాటు చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.

మున్సిపల్‌ కార్మికులకు వాటర్‌ బాటిళ్లు పంపిణీ

మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్మికులకు ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ వాటర్‌ బాటిళ్లు అందజేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో స్టీల్‌ వాటర్‌ బాటిళ్లను శ్రీపాదరావు స్మారకార్ధం అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మహంకాళి స్వామి, బొంతల రాజేశ్‌, మారెల్లి రాజిరెడ్డి, పెద్దెల్లి ప్రకాశ్‌, తిప్పారపు శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement