
సన్నబియ్యంపై ప్రజల్లో సానుకూల స్పందన
గోదావరిఖని: సన్నబియ్యం పంపిణీపై ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తోందని కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ అన్నారు. 46వ డివిజన్లో రేషన్కార్డుదారు ఇంట్లో శనివారం వారు సన్నబియ్యంతో వండిన భోజనం చేశారు. అనంతరం మాట్లాడారు. రేషన్కార్డుల ద్వారా ఇకనుంచి సన్నబియ్యమే పంపిణీ చే స్తామని వారు తెలిపారు. ఈ సంతోష సమయంలో లబ్ధిదారులతో కలిసి భోజనం చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీపాద ఈశ్వర్, అ ధికారులతోపాటు నాయకులు మహంకాళి స్వామి, బొంతల రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రతీ కుటుంబానికి సంక్షేమ పథకాలు
రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతీ కుటుంబానికి చేరాలని ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ ఆకాంక్షించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంక్షేమ పథకాలపై ఆయన సమీక్షించారు. పేదల కోసం అందుబాటులో ఉంచిన సన్నబి య్యం పథకం గురించి ప్రజలకు వివరించాలన్నా రు. లబ్ధిదారుకు ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులకు సూచించారు. కార్యకర్తలు ప్రజలతో సన్నిహితంగా ఉండి, వారి సమస్యలను పరిష్కరించేందుకు ముందుండాలని ఆయన అన్నారు.
● కలెక్టర్ కోయ శ్రీహర్ష, ఎమ్మెల్యే ఠాకూర్