విశిష్ట గుర్తింపు కార్డుతో ప్రభుత్వ పథకాలు | - | Sakshi
Sakshi News home page

విశిష్ట గుర్తింపు కార్డుతో ప్రభుత్వ పథకాలు

Apr 18 2025 1:48 AM | Updated on Apr 18 2025 1:48 AM

విశిష్ట గుర్తింపు కార్డుతో ప్రభుత్వ పథకాలు

విశిష్ట గుర్తింపు కార్డుతో ప్రభుత్వ పథకాలు

రామగిరి(మంథని): రైతులకు ఇచ్చే విశిష్ట గుర్తింపు కార్డుతో ప్రభుత్వ పథకాలు అందజేస్తారని మంథని ఏడీఏ అంజని అన్నారు. గురువారం రత్నాపూర్‌ రైతువేదికలో రైతు గుర్తింపు కార్డులకు సంబందించి మంథని డివిజన్‌లోని మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఏడీఏ మాట్లాడుతూ, వ్యవసాయ డిజిటలీకరణలో భాగంగా రైతులకు ఆధార్‌ తరహలో విశిష్ట గుర్తింపు సంఖ్యను ఇస్తారన్నారు. విశిష్ట గుర్తింపు కార్డుతో రైతులు పండించిన పంటలను కనీస మద్దతు ధరకు అమ్ముకోవడానికి ఉపయోగించుకోవచ్చునన్నారు. కార్యక్రమంలో ఆయా మండలాల వ్యవసాయ అధికారులు చిందం శ్రీకాంత్‌, అనూష, రామకృష్ణ, నవ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement