
టవర్లు పూర్తి చేయాలి
పార్వతీపురంటౌన్: పార్వతీపురం మన్యం జిల్లాలో అసంపూర్తిగా ఉన్న మొబైల్ టవర్ల పనులను తక్షణమే పూర్తి చేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. మొబైల్ టవర్లు, గృహ నిర్మాణం పట్టాలపై గురువారం స్ధానిక కలెక్టరేట్లో సంబంధింత అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మొబైల్ టవర్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని, జిల్లాలో ఇంకా 16 మొబైల్ టవర్ల నిర్మాణం పూర్తి కావాల్సి ఉందన్నారు. గుమలక్ష్మీపురం మండలం వడబాయి, కొమరాడ మండలం ఊటకోసు, వనబడి, సాలూరు మండలం సూరపాడు, చోర గ్రామాల వద్ద రహదారుల నిర్మాణానికి పరిపాలన అనుమతులు జారీ చేశామని వాటిని త్వరితగతిన పూర్తి చేసి మొబైల్ టవర్ల నిర్మాణం వేగవతం కావడానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పనులు ఆలస్యం చేస్తూ బాధ్యతా రాహితంగా పని చేస్తున్న వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. బత్తిలి, కొమరాడ మండలం ఉలికేసు, బదిలీటీనకు, సాలూరు మండలంలోని భధ్ర పనులకు తక్షణమే అంచనాలు సమర్పించాలని ఆదేశించారు. అటవీ ప్రాంతంలో ఇప్పటికే నిర్మాణంలో ఉన్న గృహాలకు అటవీ అనుమతులు జారీచేసేందుకు నిబంధనలు పరిశీలించాలని అటవీ అనుమతుల జిల్లా స్థాయి కమిటీతో ఇందులో భాగంగా చర్చించామని తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభిక, ఐటీడీఎ పీఓ అశుతోష్ శ్రీవాస్తవ, సీతంపేట ఐటీడీఎ పీఓ యశ్వంత్ కుమార్ రెడ్డి, డీఆర్ఓ కె. హేమలత, డ్వామాపీడీ కె. రామచంద్రరావు, తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్