
హక్కుల పట్ల గిరిజనులకు అవగాహన ఉండాలి
పార్వతీపురంటౌన్: గిరిజనులకు వారి హక్కులు, బాధ్యతల పట్ల అవగాహన కలిగి ఉండాలని విజయనగరం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి డా. ఎ. కృష్ణప్రసాద్ అన్నారు. ఈ మేరకు గురువారం జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహించిన న్యాయవిజ్ఞాన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం గిరిజనుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పలు పథకాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. నాగరిక సమాజానికి దూరంగా ఉంటున్న గిరిజనులకు రాజ్యాంగం ద్వారా ప్రత్యేక హక్కులు కల్పించినట్లు తెలిపారు. గిరిజన హక్కులు పరిరక్షించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు చెప్పారు.
సబ్జైల్ ఆకస్మిక తనిఖీ
పార్వతీపురం సబ్ జైలును గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. జైలులో ఖైదీలతో ముఖాముఖి మాట్లాడి వసతులు పరిశీలించారు. నాణ్యమైన ఆహారం అందుతోందా? లేదా? అని ఖైదీలను అడిగి తెలుసుకున్నారు. నిబంధనల ప్రకారం నడుచుకోవాలని జైలు సిబ్బందిని ఆదేశించారు. అనంతరం జైలు రికార్డులు పరిశీలించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో అదనపు జూనియర్ సివిల్ జడ్జి జె.సౌమ్య జోస్పిన్, డీఆర్డీఏ ఏపీడీ సత్యంనాయుడు, లోక్ అదాలత్ సభ్యులు టి.జోగారావు, ఎంఎల్ఎస్సీ సిబ్బంది కె. సునీత, జి.గంగాదేవి, పారాలీగల్ వలంటీర్లు, గిరిజనులు పాల్గొన్నారు.