యోగాతో జీవనాడులు ఉత్తేజం | - | Sakshi
Sakshi News home page

యోగాతో జీవనాడులు ఉత్తేజం

May 30 2025 1:38 AM | Updated on May 30 2025 1:38 AM

యోగాతో జీవనాడులు ఉత్తేజం

యోగాతో జీవనాడులు ఉత్తేజం

పార్వతీపురం టౌన్‌: యోగాసనాలతో మానవ జీవనాడులు ఉత్తేజమవుతాయని పార్వతీపురం మన్యం జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా.ఎస్‌.భాస్కరరావు అన్నారు. ఈ మేరకు గురువారం స్థానిక వైద్యారోగ్య కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు, వైద్యసిబ్బందికి యోగాసనాలపై యోగా గురువు మోహన్‌ శిక్షణ ఇచ్చారు. ప్రాణాయామంతో పాటు వివిధ భంగిమల యోగాసనాలను వేయించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి మాట్లాడుతూ కలెక్టర్‌ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ యోగాసనాలు అలవర్చుకునే విధంగా యోగా గురువుతో శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత రోజుల్లో మానసిక ప్రశాంతత, పని ఒత్తిడిని జయించేందుకు యోగా సాధన ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. అలాగే సీ్త్ర శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని కురుపాం, పాలకొండ, సాలూరులలో యోగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా సీ్త్ర శిశు సంక్షేమశాఖ పీడీ టి.కనక దుర్గ, జిల్లా ఆర్‌బీఎస్‌కే కోఆర్డినేటర్‌ డా. టి.జగన్నాథ రావు, ఐసీడీఎస్‌ పీఓలు బి.శ్రీనివాసరావు, జి. సుగుణ కుమారి, ఎస్‌.సుక్కా తదితరులు పాల్గొన్నారు.

డీఎంహెచ్‌ఓ భాస్కర రావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement